Heart Attack | ఇటీవల గుండెపోటుతో చనిపోయేవారి సంఖ్య పెరిగిపోతుందే తప్ప తగ్గడం లేదు. సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడా లేకుండా గుండెపోటుతో అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. తాజాగా ప్రముఖ టీవీ నటుడు రితురాజ్ సింగ్ ఫిబ్రవరి 20 తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు.రీతు రాజ్.. కొంత కాలం క్రితం పాంక్రియాస్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాడు. అనంతరం ఇంటికి తిరిగి వచ్చాడు.
అంతలోనే గుండె పోటుకు గురై మరణించినట్లు వెల్లడించాడు స్నేహితుడు. ఆయన మృతి వార్త తెలియగానే.. సినీ సెలబ్రిటీలు షాక్ వ్యక్తం చేయడంతో పాటు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. రాజస్తాన్ వాసి అయిన రీతూ రాజ్ ఢిల్లీలో చదువుకుని ఆ తర్వాత అమెరికా వెళ్లిపోయారు. తిరిగి ఇండియాకు వచ్చిన వీరి కుటుంబం ముంబయిలో సెటిల్ అయ్యింది. ఆయన టెలివిజన్తో పాటు అనేక సినిమాల్లో నటించాడు.
బనేగీ అప్నీ బాత్, జ్యోతీ, హిట్లర్ దీదీ, షపత్, వారియర్ హై, అదాలత్, దియా ఔర్ బాతీ హమ్, సీఐడీ సీరియల్స్లో నటించారు.ప్రస్తుతం ఆయన అనుపమ అనే ధారా వాహికలో యశ్పాల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఇందులో అతడికి మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఆయన హిందీతో పాటు తమిళంలో ఓ చిత్రంలో నటించారు. అజిత్ హీరోగా వచ్చిన తనివు (తెగింపు)తో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. గత ఏడాది ఈ సినిమా తమిళనాట మంచి హిట్ కూడా అందుకుంది. ఇక ఆయన అనేక వెబ్ సిరీస్ లు కూడా చేశారు. క్రిమినల్ జస్టిస్, అభయ్, బందీస్ బండిట్స్, మేడిన్ హెవెన్, రీసెంట్ గా వచ్చిన ఇండియన్ పోలీస్ ఫోర్స్లో కనిపించారు.
Recent Posts
- Hero Suman | ఈసారి ఆంధ్రలో ఆ పార్టీదే విజయం మాత్రం పక్క.. నటుడు సుమన్
- Daggubati | వెంకటేష్ హీరోగా కానీ సురేష్ బాబు ప్రొడ్యూసర్గా ఎందుకు స్థిరపడ్డారో తెలుసా.
- Tollywood | ఈహీరోయిన్స్ మధ్య ఉన్న ఈ కుర్రాడు ఎవరో తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే ?