Anshu Ambani ‘మన్మథుడు’ హీరోయిన్ అన్షు లేటెస్ట్ ఫోటోలు వైరల్..! దేవుడి ముందు చెప్పులు వేసుకొని మరి

అక్కినేని నాగార్జున హీరోగా కె.విజయభాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆల్ టైం హిట్ మూవీ ‘మన్మథుడు’. ఈ చిత్రం ఇప్పటికీ బుల్లితెర పై ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ చిత్రం ద్వారా తెలుగు పరిచయమైంది హీరోయిన్ అన్షు. మహి అనే పాత్రలో అమాయకంగా కనిపిస్తూనే క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది.కనిపించేది కాసేపే అయినా కథ మొత్తం ఈ అమ్మడి పాత్ర చుట్టూనే తిరుగుతుంది.

ఈ మూవీ తర్వాత అన్షు.. ప్రభాస్ నటించిన ‘రాఘవేంద్ర’ మూవీలో కూడా హీరోయిన్ గా నటించింది.ఇందులో కూడా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పాత్రే కావడం గమనార్హం.అటు తర్వాత శివాజీ హీరోగా నటించిన ‘మిస్సమ్మ’ చిత్రంలో కూడా చిన్న పాత్రలో కనిపించింది.అంతే మళ్ళీ తెలుగులో కనిపించింది లేదు. అటు తర్వాత సచిన్ సాగర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని విదేశాల్లో నివసిస్తుంది. అన్షు దంపతులకి ఇద్దరు పిల్లల.

ప్రస్తుతం హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది అన్షు.మొన్నటికి మొన్న ఈ అమ్మడు తెలుగు సినిమాల్లో రీ ఎంట్రీకి ఇవ్వడానికి రెడీ అవుతుందని..త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీతో ఈమె మళ్ళీ సినిమాల్లో బిజీ కావాలని భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ దాని పై ఎటువంటి క్లారిటీ లేదు.ఇదిలా ఉండగా..తాజాగా అన్షు షేర్‌ చేసిన ఒక ఫొటో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అదే సమయంలో నెటిజన్లు ఈ ఫొటోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకు ఏమైందంటే.. అన్షు తాజాగా షేర్‌ చేసిన ఫొటోలో వినాయక విగ్రహం వద్ద చెప్పులు వేసుకుని కనిపించిందామె. ఇప్పుడిదే నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. దేవుడి దగ్గర చెప్పులు వేసుకోవడమేంటి? అంటూ నెటిజన్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కొందరైతే ఏకంగా బూతులతో విరుచుకుపడుతున్నారు. అయితే ఇది అనుకోకుండానే జరిగింది. కొందరు నెటిజన్లు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమెకు సపోర్టుగా నిలుస్తున్నారు.

Leave a Reply