కోర్ట్ లో లొంగిపోయిన పవన్ కళ్యాణ్ హీరోయిన్..!కారణం ఇదే,.

బ్యూటీ అమీషాపటేల్ ప్రస్తుతం సినిమాలు లేక, సోషల్ మీడియాలో రోజూ ఫోటోలు అప్ డేట్ చేసుకుంటూ.. అలా వచ్చిన సంపాదనతో ఎలాగోలా బండి నెట్టుకొస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ముదురు భామకు పెద్ద ఎదురు దెబ్బె తగిలింది. అమీషాపటేల్ కహో నా ప్యార్ హై’హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ మూవీస్ లో నటించింది. పవన్ కళ్యాణ్ నటించిన బద్రి మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.

ఆ తర్వాత నరసింహుడు, నాని, పరమవీర చక్ర మూవీస్ లో నటించింది. ఈ రోజు అమీషా పటేల్చెక్ బౌన్స్ కేసులో రాంచీ సివిల్ కోర్టులో లొంగిపోయింది. ప్రముఖ నిర్మాత, వ్యాపార వేత్త అయిన అజయ్ కుమార్ సింగ్.. అమీషా పటేల్ పై చెక్ బౌన్స్ కేసు వేశారు. గతంలో తన వద్ద అమీషా పటేల్ రూ.2.5 కోట్లు అప్పగా తీసుకుందని.. కానీ సినిమా మాత్రం పూర్తి చేయలేదని,

తిరిగి డబ్బు ఇవ్వమని కోరితే వివిధ కారణాలు చెప్పి తప్పించుకుంటుందని తన పిటీషన్ లో పేర్కొన్నాడు.అమీషా పటేల్ ఇప్పుడు అసలు రూ.2.5 కోట్లకు గాను వడ్డీ రూ.50 లక్షలు కలిపి మొత్తం రూ.3 కోట్లు ఇప్పించాలని కోర్టును కోరాడు. ఈ కేసు విచారణ చేసిన కోర్టు ఏప్రిల్ 6న అమీషాకు వారెంట్ ఇష్యూ చేయగా నేడు ఆమె కోర్టులో లొంగిపోయింది.

తర్వాత కోర్టు పరలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కోర్టు నుంచి అమీషా పటేల్ బయటకు వచ్చే సమయంలో మీడియా వాళ్లు ఎగబడ్డారు. దీంతో ఆమె తలకు ముసుగు కప్పుకొని ఎవరినీ పట్టించుకోకుండా కారులో అక్కడ నుంచి వెళ్లిపోయింది. అమీషా ముసుగులో కోర్టు నుంచి బయటకు రావడానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

Leave a Reply