టాలీవుడ్ స్టార్ నటి రష్మిక మందన , హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపస్తున్న విషయం తెలిసిందే. విమానాశ్రయాల్లో ఇద్దరూ కలిసి జంటగా కనిపించడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ పలు వెబ్సైట్లు, సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. కాగా, రష్మికతో డేటింగ్పై తాజాగా నటుడు స్పందించాడు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీనివాస్ డేటింగ్ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి వార్తలు ఎలా సృష్టిస్తారంటూ అసహనం వ్యక్తం చేశారు.హిందీ చిత్రం ‘ఛత్రపతి’ ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..మేమిద్దరం ప్రేమలో, డేటింగ్ లో ఉన్నామంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని.. అందులో ఎలాంటి నిజం లేదని ఆయన సమాధానమిచ్చారు.
మేమిద్దరం హైదరాబాద్ లోనే ఉండేది. రెగ్యులర్ గా ముంబైకి షూటింగ్ కి వస్తున్నాం. అలా వెళ్ళేటప్పుడు ఎయిర్ పోర్ట్ లో అనుకోకుండా కలుసుకున్నాం. అంత మాత్రానికే ఇలాంటి వార్తలు రాస్తారా? ఆవన్నీ రూమర్స్ మాత్రమే అని బెల్లంకొండ హీరో కొట్టిపడేశారు. దీంతో రష్మికతో బెల్లంకొండ డేటింగ్ పై క్లారిటీవచ్చేసింది. దేవరకొండ సేఫ్ అంటూ కొందరు అభిమానులు రిలాక్స్ అవుతున్నారు.