MLA Seethakka | తొలిసారి సీతక్క స్పీచ్ తో దద్దరిల్లిన అసెంబ్లీ..

allroudadda

MLA Seethakka | తెలంగాణ శాసనసభ సమావేశాలు ఐదోరోజు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై సభలో చర్చ జరగనుంది. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చర్చను వాయిదా వేసి మేడిగడ్డ పర్యటనకు వెళ్లనున్నారు. సభ ప్రారంభమైన 10 నిమిషాలకు అసెంబ్లీ నుంచి మేడిగడ్డకు బయల్దేరేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది. మేడిగడ్డ ఫీల్డ్ విజిట్ కోసం సభ్యులందరిని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానించారు. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లోనే మేడిగడ్డకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లనున్నారు.అది పక్కన పెడితే నిన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో సాగింది.

ఐటీ అంశంపై జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుపై తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఆర్టీసీ కార్మికుల సమస్యల, ఆటో డ్రైవర్ల సమస్యలు, ఇతర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఇదే సమయంలో పంచాయతీ రాజ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి సీతక్క ఇచ్చిన స్పీచ్ కి అసెంబ్లీ దద్దరిల్లింది. సీఎం రేవంత్ రెడ్డి సైతం సీతక్క వైపు ఆశ్చర్యంగా చూశారు.

allroudadda
allroudadda

ఇక ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆమె తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చారు. ప్రజాసమస్యలపై ప్రతిపక్ష పార్టీలు సంధించిన ప్రశ్నలకు ధీటుగా సమాధానాలు ఇచ్చారు. మహిళలు ఉచిత ప్రయాణం చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఓర్వలేకపోతుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉచిత ప్రయాణం కావాలా? వద్దా? అనేది సూటిగా చెప్పాలని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. బీఆర్ఎస్ మళ్లీ సెంటిమెంట్ రాజకీయాలు మొదలు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

KCR | ఓటమి తరువాత తొలిసారి జనంలోకి కేసీఆర్.. ఇంకా రేవంత్ ఔట్..?

ఆర్టీసీ ఆస్తులను అమ్ముకున్న చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వంది అంటూ సీతక్క మండిపడ్డారు.పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ ఆస్తులు ధ్వంసం చేసి, కుదేళ్లు చేసి, కబ్జాలు చేసి, ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మహత్యకు కారణమైన వీళ్లు, ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల గురించి మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. పేద వాళ్ల ఎక్కే బస్సు రేట్ల పెంచి.. ఇవ్వాలా ఆడవాళ్లు బస్సులో ఉచితంగా వస్తే తట్టుకోలేక పోతున్నారు.

allroudadda
allroudadda

రైతు బంధు పేరుతో ఎంతో మంది ధనవంతులకు లక్షల రూపాయలు కట్టబెడితే పేదవారు ఎవరైనా మీ ఇంటికి ముందుకు వచ్చి ధర్నాలు చేశారా?, ఈ రోజు ఆటోల అంశం ముందుకు పెట్టుకుని అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని అమె అన్నారు. ఈ బీఆర్ఎస్ ఎప్పుడు సెంటిమెంట్ ని వాడుకుని ఒకర్ని ముందు పెట్టి, వెనుక నుంచి మీరు వస్తారు, ఇది మీ నైజం అంటూ బీఆర్ఎస్ పై మండిపడ్డారు.మహిళలు ఉచిత ప్రయాణం ద్వారా నెలకు ఐదారు వేలు మిగులుతున్నాయి అంటే బీఆర్ఎస్ నేతలు ఎందుకు తట్టుకోలేక పోతున్నారంటూ ఆమె ప్రశ్నించారు. ఇక మంత్రి సీతక్క ఇచ్చిన స్పీచ్ కి కాసేపు అసెంబ్లీ దద్దరిల్లింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం సీతక్క ప్రసంగానికి అవాక్కయ్యారు.

Recent Posts

Leave a Reply