Director | తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఫిల్మ్ డైరెక్టర్ వెట్రి దురైస్వామి అకాల మరణం చెందారు. సట్లెజ్ నదిలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లాలో వెట్రి ప్రయాణిస్తున్న కారు ఫిబ్రవరి 4వ తేదీన ప్రమాదానికి గురైంది.తిరుప్పూర్కి చెందిన స్నేహితుడు గోపీనాథ్తో కలిసి కొద్దిరోజుల కిందట హిమాచల్ప్రదేశ్ సందర్శనకు వెళ్లిన ఆయన ప్రమాదం తర్వాత అదృశ్యమయ్యారు.
గత 9 రోజులుగా కనిపించకుండా పోయిన వెట్రి దురైస్వామి మృతదేహాన్ని సోమవారం గుర్తించారు. చెన్నై మాజీ మేయర్, మనిదనేయ మక్కల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సైదై దురైస్వామి కుమారుడు వెట్రి దురైస్వామి తిరుప్పూర్కి చెందిన స్నేహితుడు గోపీనాథ్తో కలిసి ఇటీవలే హిమాచల్ప్రదేశ్ పర్యటనకు వెళ్లారు. ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం కసాంగ్ నలా ప్రాంతంలో జాతీయహైవేపై వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి సట్లెజ్ నదిలో పడిపోయింది.
తమిళ స్టార్ హీరో అజిత్ ..
వాళ్లు కాజా ప్రాంతం నుంచి సిమ్లా వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు డ్రైవరు అక్కడిక్కడే మృతి చెందాడు. గోపీనాథ్ తీవ్రగాయాలతో బయటపడ్డారు. రమ్య నంబీషన్, విధార్థ్ ప్రధాన పాత్రలలో నటించిన ‘ఎంద్రావతు ఒరు నాల్ (2021)’ చిత్రానికి వెట్రి దురైసామికి మంచి పేరు వచ్చింది. తమిళ స్టార్ హీరో అజిత్ వెట్రికి మంచి మిత్రుడు. వెట్రి దురైసామి మృతికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామి, మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వం తదితరులు సంతాపం తెలిపారు.
Recent Posts
- Sundeep Kishan | నా ఆర్థిక చాలా పరిస్థితి దారుణంగా ఉంది.. అందుకే ఆ పని చేస్తున్నా..
- Rajamouli | ఎన్టీఆర్ ఇచ్చిన గిఫ్ట్ చూసి షాక్ అయిన రాజమౌళి..!
- Krithi Shetty | బెల్లీ డాన్సుతో అదరగొడుతున్న బేబమ్మ..