Farmer Idea| రైతన్న వాటాన్ ఐడియా.. పంటకి కాపలాగా తమన్నా, సమంతా..!

అందాల భామలు తమన్నా, రకుల్ ప్రీత్ విశాఖ జిల్లాలోని ఓ రైతుకు అండగా నిలుస్తున్నారు. ఆ రైతు పొలం వైపు ఎవరూ కన్నెత్తి చూడకుండా చేస్తున్నారు. నిత్యం అక్కడే ఉంటూ పంట పొలాలకు కావలి కాస్తున్నారు. అదేంటి.. నిత్యం షూటింగ్‌లతో బిజీగా ఉండే తారలు.. కావలి కాయడం ఏంటీ .. అనుకుంటున్నారా..

విశాఖ జిల్లా చీపురుపల్లిలో బంగారు రాజు అనే రైతు .. సబ్బవరం మండలం అమృతపురం గ్రామంలో రెండెకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాడు. రసాయన ఎరువులతో వ్యవసాయం చేసి నష్టపోయిన ఈ రైతు .. గుంటూరులోని పాలకేర్‌లో శిక్షణ తీసుకుని సేంద్రియ వ్యవసాయం మెుదలుపెట్టాడు. అలాగే 10మంది రైతులకు శిక్షణ ఇచ్చి సేంద్రీయ వ్యవసాయం వైపు మరల్చాడు. దీంతో పంట పొలాలు కళకళలాడుతున్నాయి.

పొలం రోడ్డు పక్కనే ఉండటం.. రోడ్డున పోయే ప్రతీ ఒక్కరూ చూపు తిప్పుకోలేని విధంగా పెరగడంతో.. పంట పొలాలకు దిష్టి తగులుతోందట.దీంతో బంగారు రాజుకి ఓ ఐడియా వచ్చింది. పొలంలో సినీ తారల ఫోటోలు పెట్టేశాడు. తమన్నా, రకుల్‌ నిలువెత్తు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. ఎందుకిలా చేశావ్ అంటే.. ఇప్పుడు అందరి చూపూ తన పొలంపై కాకుండా ఫ్లెక్సీలపైన మాత్రమే పడుతుందని బంగారు రాజు చెబుతున్నాడు. అంతేకాదు జంతువులు, పక్షులు కుడా మనుషులు ఉన్నారనుకుని ఇటు వైపు రావడం లేదంటున్నాడు.

Leave a Reply