World Cup 2023 | టీమ్ఇండియా ముచ్చటగా మూడోసారి వన్డే ప్రపంచకప్ ను ముద్దాలని భావించగా ఆస్ట్రేలియా అడ్డుపడింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించి ఆరోసారి వన్డే ప్రపంచకప్ను కైవసం చేసుకుంది.ఫైనల్ మ్యాచ్ వరకు వరుస మ్యాచుల్లో గెలుపొందిన టీమ్ఇండియా ఆఖరి మ్యాచ్లో చతికిల పడింది.కనీసం పోరాటం కూడా చేయలేదు. మొదట బ్యాటర్లు చేతులెత్తేయగా ఆ తరువాత బౌలర్లు కూడా అద్భుతాలేమీ చేయలేదు.
దీంతో భారత్కు నిరాశ తప్పలేదు. వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతుల్లో భారత్ ఓడిపోవడం ఇది రెండోసారి. గతంలో 2003 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓడిపోయింది.ఈ ఓటమితో స్టేడియంలో ఉన్న భారత్ ప్రేక్షకులు తీవ్ర భావోద్వేగానికి లోనై వెనుదిరిగారు. సిరాజ్, రాహుల్ తీవ్ర భావోద్వేగానికి గురవ్వడంతో సహచర ఆటగాళ్లు ఓదార్చారు. అయితే కంట్రోల్ కాకపోవడంతో విరాట్, రోహిత్ శర్మ కూడా ఏడ్చేశారు. టీమిండియా ప్లేయర్లు కన్నీటి పర్యంతం అయ్యారు.
కెప్టెన్ రోహిత్ శర్మ అయితే అస్సలు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. తలకూడా పైకెత్తకుండా కనీళ్లు తుడుచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై క్రీడాభిమానులు, క్రికెట్ లవర్స్ చిత్రవిచిత్రాలుగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘ఇలా చూడలేం దయచేసి ఏడవకండి’ అని ట్విట్టర్ వేదికగా కొందరు రోహిత్ను ఓదారుస్తుండగా.. ఇంకొందరేమో ‘చేయాల్సిదంతా చేసి ఇక ఏడుపెందుకు బ్రో..’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో నెటిజన్లను కట్టిపడేస్తోంది.