Johnny Master | ఢీ షో నుంచి వచ్చి భారతీయ సినిమాను తన డ్యాన్సులతో ఉర్రుతలూగించిన జానీ మాస్టర్ కేవలం సినిమా రణగంలోనే కాకుండా సామాజిక సేవాకార్యక్రమాల్లోనూ ముందుంటారు. నెల్లూరు ఎప్పుడు వచ్చినా సామాజిక సేవాకార్యక్రమాల్లో పాల్గొని అక్కడ కాపు సామజిక వర్గ నేతలను కలుస్తూ ఉంటారు. మొన్నటి వరకు తెలంగాణా ఎన్నికల సంగ్రామం నడిచింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటూనే ఉంది.
ఏ ఏ స్థానాలనుంచి ఎవరు పోటీ చేస్తున్నారనే విషయాల పట్ల కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలో జానీ మాస్టర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే జానీ మాస్టర్ స్వస్థలం నెల్లూరు నుంచే జనసేన అభ్యర్థిగా రేసులో దిగుతున్నారని సమాచారం.అయితే ఇన్నాళ్లు వార్తల్లోకి రాని మాస్టర్ ఇప్పుడే ఎందుకు హాట్ టాపిక్ అయ్యారంటే ..ఇటీవల నెల్లూరులో జరిగిన అంగన్వాడీల ధర్నాలో జానీ మాస్టర్ పాల్గొని వారి పోరాటానికి మద్దతు తెలిపారు.అంగన్వాడి కార్యకర్తల పోరాటంలో అసువులు బాసిన రమణమ్మ అనే కార్యకర్త కుటుంబానికి జానీ మాస్టర్ రూ.70 వేలు ఆర్థిక సాయం అందజేశారు.
తమ న్యాయమైన కోర్కెల సాధన కోసం చేస్తున్న ఆందోళనలో పాల్గొని మానసిక ఒత్తిడితో అంగన్వాడీ కార్యకర్త చనిపోవడం బాధాకరమన్నారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో తిరిగి పునరావృతం కాకూడదని చెప్పారు. ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు.అది పక్కన పెడితే తాజాగా షేక్ జానీ మాస్టర్ బుధవారం మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించారు.