Kolikapudi | ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి అభివందనాలు అంటూ కన్నీరు పెట్టుకున్న కొలిక‌పూడి..

allroudadda

Kolikapudi | రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ – జనసేన తొలి జాబితాను విడుదల చేశారు. 24 అసెంబ్లీ, 3 లోక్ సభ సీట్లలో జనసేన పోటీ చేస్తుందని చంద్రబాబు ప్రకటించారు. అలాగే టీడీపీ పోటీ చేసే 94 అసెంబ్లీ స్థానాల తొలి జాబితాను చంద్రబాబు విడుదల చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అరాచక పాలనకు ముగింపు పలకడమే కూటమి లక్ష్యమని చంద్రబాబు, పవన్ అన్నారు. ప్రయోగాల జోలికి వెళ్లకుండా, తక్కువ సీట్లైనా పర్వాలేదనే, అన్నీ ఆలోచించే తాము ముందడుగు వేశామని పవన్ చెప్పారు.

నాయకులంతా వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి, రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాలని పవన్ సూచించారు. టీడీపీ ఓటు జనసేనకు ఎంత ముఖ్యమో, జనసేన ఓటు టీడీపీకి అంతే ముఖ్యమని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లో చీలకూడదని అన్నారు. జనసేన – టీడీపీ కూటమికి బీజేపీ మద్దతు ఉందని తెలిపారు.ఈ నేపద్యంలో తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే ఎస్సీ అభ్యర్థిగా కొలికపూడి శ్రీనివాసరావుని టిడిపి-జనసేన ఉమ్మడి పార్టీల అధినేతలు చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు ప్రకటించడంతో తిరువూరులో సంబరాలు చేసుకుంటున్నారు టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు.

allroudadda
allroudadda

ప్ర‌తి ఇంటికి తిరిగి అన్ని విష‌యాల‌పై స‌మ‌గ్ర ప‌రిశీల‌న చేస్తామ‌ని కూడా ఆయ‌న చెప్పుకొచ్చారు. అయితే మాజీ మంత్రి కొడాలి నాని చేసే రాజకీయ విమర్శలు కేవలం సీఎం జగన్‌ను తృప్తి పరచడం కోసమే చేస్తున్నారని ఏపీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు.కొడాలి నాని అందరిని నమ్మించి మోసం చేస్తున్నారని.. అలాంటి బాధితుల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరని అన్నారు.

100 కిలోలు బరువు తగ్గాలని టార్గెట్.. చివరికి జిమ్ చేస్తూ 21ఏళ్లకే..

ఉమ్మడి కృష్ణా జిల్లాలో కమ్మ సామాజిక వర్గం నాయకులు, వ్యాపారస్తులు కొడాలి నాని బాధితులేనని అన్నారు. గుడివాడలో కాపులు నాని వల్ల ఆర్థికంగా నష్టపోయారని, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారని అన్నారు. ‘కొడాలి నానికి ఇదే నా హెచ్చరిక.. అభివృద్ది గురించి మాట్లాడాలని.. దానికి మేము సమాధానం చెబుతామని’ కొలికపూడి శ్రీనివాసరావు హెచ్చ‌రించారు.

Leave a Reply