Lakshmi Parvathi: రజనీకాంత్ కు వార్నింగ్ ఇచ్చిన లక్ష్మీపార్వతి..!

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ నిన్న విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల ప్రారంభ సభలో చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత, తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి మండిపడ్డారు. రజనీకాంత్ మరోసారి ఎన్టీఆర్ గురించి మాట్లాడితే ఊరుకోబోనని హెచ్చరించారు.

నాడు వెన్నుపోటు సమయంలో చంద్రబాబుకు మద్దతుగా నిలిచినవాళ్లలో రజనీకాంత్ కూడా ఉన్నారని లక్ష్మీపార్వతి వెల్లడించారు. తర్వాత కాలంలో ఎన్టీఆర్ ను కలిసిన రజనీకాంత్ తాను తప్పు చేశానని క్షమాపణ కోరారని ఆమె వివరించారు. అప్పట్లో వెన్నుపోటు వ్యవహారంలో రజనీకాంత్ ను తమిళ మీడియా కూడా విమర్శించిందని, దాంతో రజనీకాంత్ చాలాకాలం ఏపీ రాజకీయాలకు దూరంగా ఉన్నారని లక్ష్మీపార్వతి తెలిపారు.

అయితే, చంద్రబాబు ఎంతో తెలివిగా మళ్లీ రజనీకాంత్ ను వాడుకుంటున్నారని, రజనీకాంత్ ద్వారా బీజేపీకి దగ్గరవ్వాలన్నది చంద్రబాబు ఎత్తుగడ అని ఆరోపించారు. సర్వేలన్నీ జగన్ కు అనుకూలంగా ఉండడంతో, చంద్రబాబు సినిమా వాళ్లతో నాటకాలు ఆడిస్తున్నారని విమర్శించారు.

Leave a Reply