Mahesh Babu | ఫ్యాన్స్ కి తెలుగులో గుంటూరు కారం నా చివరి సినిమా.. మహేశ్ షాకింగ్ కామెంట్స్,

allroudadda

Mahesh Babu | సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం సినిమా సంక్రాంతికి రిలీజై వసూళ్ల సునామి సృష్టించింది. సినిమాకు వచ్చిన టాక్ కి వచ్చిన కలెక్షన్స్ కి ఏమాత్రం సంబంధం లేదు. వారం రోజుల్లో గుంటూరు కారం సినిమా 212 కోట్ల గ్రాస్ తో రీజనల్ సినిమాల్లో రికార్డు సృష్టించిందని నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమా సక్సెస్ పై నిర్మాత నాగ వంశీ మీడియా తో మాట్లాడారు. సినిమా అర్ధరాత్రి షోస్ వల్ల కొంత బ్యాడ్ టాక్ వచ్చింది.

అయితే రిలీజ్ రోజు టాక్ మారిందని. ఫ్యామిలీస్ సినిమా ను హిట్ చేశాయని అన్నారు.ఇకపోతే ఇటీవల చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్న విషయం మనకు తెలిసిందే.స్వయంగా మహేష్ బాబు ఈ సినిమా సక్సెస్ పార్టీని అరెంజ్ చేశారు.ఈ పార్టీ అనంతరం మహేష్ బాబు యాంకర్ సుమతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.“సినిమా మొదలు పెట్టినప్పుడే నేను త్రివిక్రమ్ అయితే ఒక విషయం గట్టిగా అనుకున్నాము.

allroudadda
allroudadda

ఈ సినిమాలో ఓ రెండు పాటలు అయినా గట్టిగా చేద్దామని ఫిక్స్ అయ్యాము. ఎందుకంటే.. ఈ సినిమా తరువాత నేను మళ్ళీ రీజినల్ సినిమా చేసే అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇదే నా చివరి తెలుగు సినిమా కావొచ్చు. కాబట్టి మళ్ళీ మన తెలుగు మాస్ సాంగ్స్ కి డాన్స్ చేసే అవకాశం ఉంటుందో లేదో కూడా తెలియదు.అందుకనే ఈ మూవీ డాన్స్ వేయాలని నిర్ణయించుకున్నాము.

 ప్రభాస్ పెళ్లిచేసుకోబోయే అమ్మాయి ఎవ్వరో క్లారిటీ ఇచ్చిన శ్యామలాదేవి..

దానికి తగ్గట్టే మూవీలోని మొదటి సాంగ్ అండ్ లాస్ట్ సాంగ్ ని ప్లాన్ చేశాము. అలాగే సెకండ్ హాఫ్ లో గో‌డౌన్‌లో ఒక సాంగ్ బిట్టు వస్తుంది. నెక్లీస్ గొలుసు సాంగ్ చేద్దామని కూడా ముందే ఫిక్స్ అయ్యాయి. దానికి తగ్గట్టు ముందుకు ఓ రెండు సాంగ్స్ పెట్టి డిజైన్ చేశాము. మొదటిలో చేసేద్దాం ఏముంది అనుకున్నాను. కానీ షూటింగ్ టైంకి ఈ అమ్మాయితో ఎలా చేయాలని కొంచెం టెన్షన్ పడ్డాను” అంటూ చెప్పుకొచ్చారు.

Leave a Reply