మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ షూటింగ్ కు ప్రస్తుతం అనుకూల పరిస్థితులు లేవనే సంగతి తెలిసిందే. ఒక సమస్య పరిష్కారం అయ్యే సమయంలోపు మరో సమస్య ఎదురవుతూ ఉండటంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందో అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. పూజా హెగ్డే వల్ల ఈ మూవీ షూట్ ఆలస్యమవుతోందని తెలుస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూట్ వచ్చే ఏడాది మొదలవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
మరోవైపు రాజమౌళి మహేష్ Mahesh Babu కాంబో మూవీకి సంబంధించి షాకింగ్ అప్ డేట్ వచ్చిన సంగతి తెలిసిందే.అది పక్కన పెడితే ఈ సినిమా కోసం మహేష్ రూ. 78 కోట్ల రూపాయలతో పాటు జిఎస్టిని అందుకోబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం పాన్ మన ఇండియా హీరోలు సుమారు వంద కోట్ల వరకు అందుకుంటున్నారు. కానీ మహేష్ బాబు రీజనల్ సినిమా కోసమే ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోనున్నారు.
దాదాపు 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో గుంటూరు కారం సినిమాను నిర్మించనున్నారు.రీజనల్ సినిమాలకు సంబంధించి అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే వారి జాబితాలో మహేష్ బాబు టాప్లో ఉంటారు. ఈ సినిమా తర్వాత SS రాజమౌళి యొక్క SSMB 29 పాన్ ఇండియా సినిమా హిట్ట్ అయితే ఆయన రేంజ్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడం కష్టమే.