Nara Brahmani | జగన్ కి ఇంకా చుక్కలే.. పాదయాత్రకు సిద్దమైన నారాబ్రహ్మణి..?

Nara Brahmani

Nara Brahmani | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబం రాజకీయాల్లో యాక్టివ్ కాబోతుందా…? ఎప్పుడు లేని విధంగా చంద్రబాబు కుటుంబం బయటకు రావడం దేనికి సంకేతం…? ఇప్పుడు ఈ ప్రశ్నలు కాస్త ఆసక్తిగా మారాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మనం గమనిస్తే… ఎన్టీఆర్ కుమారులు హరికృష్ణ, బాలకృష్ణ, అల్లుళ్ళు చంద్రబాబు, దగ్గుబాటి మినహా ఎవరూ కూడా టీడీపీలో యాక్టివ్ గా లేరనే చెప్పాలి. చంద్రబాబుతో విభేదాల తర్వాత పురంధరేశ్వరి కాంగ్రెస్ లో యాక్టివ్ అయ్యారు, కేంద్ర మంత్రి అయ్యారు.

ఇక చంద్రబాబు సతీమణి గాని, ఆయన కోడలు గాని ఎవరూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. పరిపాలన అంశాల్లో కూడా వాళ్ళ జోక్యం లేదనే చెప్పాలి. అలాంటిది ఇప్పుడు భువనేశ్వరి, బ్రాహ్మణి రాజకీయంగా విమర్శలు చేయడం మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ పరిణామాల తర్వాత వాళ్ళు మీడియాతో ఎక్కువగా మాట్లాడటం జరుగుతుంది.

అలాగే పాదయాత్ర కూడా చేయడానికి భువనేశ్వరి సిద్దంగా ఉన్నారనే కామెంట్స్ సోషల్ మీడియాలో వచ్చాయి. దీనితో ఏం జరగబోతుంది అనేది ఆసక్తిగా మారింది. గతంలో జగన్ 16 నెలలు జైల్లో ఉన్న సమయంలో తన తల్లి పాదయాత్రను విజయవంతంగా నిర్వహించారు.ఇప్పుడు అదే విధంగా లోకేష్ మధ్యలో ఆపేసినటువంటి యువగలం పాదయాత్రలో నారా బ్రాహ్మణి పాదయాత్రలో పాల్గొంటారని,

త్వరలో నిహారిక రెండో పెళ్లి..! వరడు ఎవరో తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే..!

అంతేకాకుండా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా యువగళం పాదయాత్రను పూర్తి చేస్తారని అంటున్నారు. ఇప్పటికే లోకేష్ 200 రోజులకు పైగా పాదయాత్రను పూర్తిచేశారు. ఇక లోకేష్ పూర్తి చేయాల్సిన ప్రాంతాలను బ్రాహ్మణి, భువనేశ్వరి ఆ బాధ్యతను తీసుకోనున్నట్లు సమాచారం అందుతుంది. అదే జరిగితే టిడిపి నుంచి మహిళలకు మరింత ఆదరణ వస్తుందని పార్టీ అంచనా వేసుకుంది.

Leave a Reply