Adipurush: ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ మందు త్రాగి వచ్చాడా..?వైరల్ అవుతున్న మిమ్స్..

గత నెల రోజులుగా సోషల్ మీడియాలో మారుమ్రోగుతున్న పేరు ఆదిపురుష్. భారీ అంచనాల మధ్య జూన్ 16న విడుదల కాబోతున్న ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్, కృతిసనన్ జంటగా నటించిన ఈ మూవీపై హైప్ ఎక్కువగానే ఉంది. ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా.. సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా విడుదలైన సెకండ్ ట్రైలర్ కూడా అద్భుతంగానే ఉంది. దీనిని బట్టి చూస్తే ఇక మూవీ ఏ రేంజ్ లో ఉండబోతుందో స్పష్టంగా అర్థమవుతోంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో జూన్ 06న తిరుపతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా నిర్వహించారు.

ఇక ఈ వేడుకకు లక్షకు పైగా అభిమానులు వచ్చినట్టు సమాచారం. అయితే ఇప్పుడు ఈ వేడుకకు సంబంధించి ఖర్చు చేసిన వివరాలను ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఇకపోతే ఈ ఈవెంట్ లో ప్రభాస్ ఫ్యాన్స్ తో ఎంతో సరదాగా మాట్లాడాడు. సాధారణంగా ఈవెంట్స్ లో తక్కువగా మాట్లాడే అలవాటు ఉన్న ప్రభాస్, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రం అభిమానులతో మమేకమై మాట్లాడడం అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే స్టార్ హీరో అన్న తర్వాత పాజిటివిటీ ఎంత ఉంటుందో, నెగటివిటీ కూడా అదే రేంజ్ లో ఉంటుంది.

సోషల్ మీడియా ప్రభాస్ మరియు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య ఎప్పటి నుండో ఫ్యాన్ వార్స్ నడుస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. నిన్న ప్రభాస్ మాట్లాడుతున్నప్పుడు చాలా సందర్భాలలో మాట తూలడం మనం గమనించొచ్చు. ఆ భాగం వరకు వీడియో ని కట్ ని చేసి సోషల్ మీడియా లో సర్క్యూలేట్ చేసి వెక్కిరిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ త్రాగి వచ్చాడని, దేవుడి సినిమా ఈవెంట్ కి కూడా త్రాగి రావాలా?, ఒక్క మూడు గంటలు కూడా ఆపుకోలేవా అంటూ ప్రభాస్ పై కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply