నువ్వు దేవుడివి స్వామి…. 150 మంది పిల్లలను దత్తత తీసుకున్న రాఘవ లారెన్స్…!

రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. డ్యాన్స్ మాస్టర్ గా, బెస్ట్ కొరియోగ్రాఫర్ గా, నటుడిగా, దర్శకుడిగా తమిళంతో పాటు తెలుగు రాష్ట్రాలలో కూడా సుపరిచితుడే. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది చిన్నారులకు తన వంతు సాయం చేస్తూ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎన్నాళ్ళ నుంచో లారెన్స్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఎంతో మంది పిల్లలను దత్తత తీసుకొని వారి చదువుకు కావాల్సినవి అన్ని సమకూరుస్తున్నారు.

అదే విధంగా ఒక అనాధాశ్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు.కాగా లారెన్స్ హీరోగా ముని, కాంచన, గంగ, పలు చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇప్పుడే అదే జోష్ తో రుద్రుడు సినిమాతో రాబోతున్నాడు. ఈ నెల 14న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. కతిరేశన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు, తమిళ్ లో మూవీ రిలీజ్ కాబోతుంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్.

తాజాగా రుద్రుడు ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో ఒక ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా లారెన్స్ కొంత మంది అనాథ పిల్లలను స్టేజిపైకి తీసుకొచ్చి వారితో ఫోటోని దిగాడు.ఆ ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. మరో 150 మంది పిల్లలను దత్తత తీసుకొని వారికి, వారి చదువుకు కావాల్సినవి అన్ని సమకూరుస్తున్నాను. రుద్రుడు వేదికపై నుంచి ఈ విషయాన్ని మీ అందరికి తెలియచేయడం ఆనందంగా ఉంది. మీ అందరి ఆశీర్వాదాలు నాకు కావాలి అని పోస్ట్ చేశారు. దీంతో మరోసారి అందరూ లారెన్స్ ని అభినందిస్తున్నారు.

Leave a Reply