Ambati Rambabu | ఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్పై మంత్రి అంబటి రాంబాబువ్యంగ్యస్త్రాలు గుప్పించారు. ఒకరితో ఉంటూ మరొకరితో రహస్య సంబంధాలు పెట్టుకోవడం పవన్ జీవితంలో సహజమేనని ఆరోపించారు. గురువారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. విజయనగరం జిల్లాలో నిర్వహించిన సభలో టీడీపీ, జనసేన పార్టీ నాయకులు మాట్లాడిన తీరుపై విమర్శలు గుప్పించారు.రాబోయే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని వ్యాఖ్యనించడంపై స్పందించారు. రెండు పార్టీలు ఎప్పుడు విడిపోయాయయని అనుమానం వ్యక్తంచేశారు.
‘ జనసేన పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కలిసే పనిచేశాయి కదా కొత్తగా కలిసి పోటీ చేస్తామని చెప్పడంలో వింత ఏముందని ’ ప్రశ్నించారు. 2014లో రెండు పార్టీలు కలిసి పనిచేశాయి. 2019లో వైసీపీని ఓడించడానికి విడివిడిగా పనిచేశాయని పేర్కొన్నారు.మరోపక్క జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందుగానే ప్యాకేజీ మాట్లాడుకుని సభకు వచ్చారని ఆరోపించారు. చంద్రబాబుతో పవన్ ఎప్పుడూ కలిసే ఉన్నారని… చంద్రబాబు ఐదేళ్లు అడ్డగోలు పాలన చేసినప్పుడు పవన్ ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు.
నారా లోకేశ్ ను బలోపేతం చేసేందుకే జనసేన
ఎన్నోసార్లు చంద్రబాబు, లోకేశ్ లను పవన్ తిట్టారని… ఇప్పుడు అదే నోటితో ప్రశంసిస్తున్నారని విమర్శించారు. జనసేన కార్యకర్తలను పవన్ మోసం చేస్తున్నారని అన్నారు. జనసేన సభకు రానని ముందు చెప్పిన పవన్… ఆ తర్వాత ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. నారా లోకేశ్ ను బలోపేతం చేసేందుకే జనసేన పార్టీ పెట్టారా? అని ప్రశ్నించారు. అమలు చేయడం సాధ్యం కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేయాలని చంద్రబాబు అనుకుంటున్నారని విమర్శించారు. ఏపీ శ్రీలంక అయిపోతుందన్న చంద్రబాబు… ఇప్పుడు ఉచిత పథకాలను ప్రకటిస్తున్నారని చెప్పారు.