adipurush: ప్ర‌భాస్‌పై ప్రశంసల వర్షం కురిపించిన చినజీయర్ స్వామి..!

ప్రస్తుతం మరిన్ని రోజుల్లో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న భారీ పాన్ ఇండియా సినిమా “ఆదిపురుష్”. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన భారీ చిత్రం ఇది కాగా రామాయణం ఆధారంగా అయితే తెరకెక్కింది. ఇక రీసెంట్ గానే భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా జరుపుకున్న ఈ చిత్రం విషయంలో పాన్ ఇండియా వైడ్ అయితే ఇంకా ఎలాంటి అగ్రెసివ్ ప్రమోషన్స్ కనిపించలేదు.మరి దీనితో మొదట జూన్ మొదటి వారం నుంచే ప్రభాస్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయనున్నాడని టాక్ వచ్చింది.

కానీ ఫైనల్ గా అయితే ఇపుడు ప్రభాస్ నేషనల్ వైడ్ గా ఇంటర్వ్యూలు స్టార్ట్ చేయనున్నాడని తెలుస్తుంది.అది పక్కన పెదెతే ప్రభాస్‌ నటించిన ఆదిపురుష్‌ సినిమా జూన్ 16న విడుద‌ల కానుండ‌గా, ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్ జూన్ 6న‌… తిరుపతి వేదికగా అట్టహాసంగా జరిగింది. సినిమా టీమ్‌ మొత్తం ఈ కార్యక్రమానికి తరలివచ్చింది. అంతేకాదు అభిమాన నాయ‌కుడిని క‌ళ్లారా చూద్దామ‌ని వేల‌కొల‌ది అభిమానులు అక్క‌డికి చేరుకున్నారు.

గోవింద నామస్మరణ జరిగే చోట.. జై శ్రీరామ్‌, జై సియారామ్‌ నినాదాలూ హోరెత్తాయి. వేడుక‌కి త్రిదండి చినజీయర్‌ స్వామి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అతిథులుగా హాజరయ్యారు.రాముడు అడవులకు వెళ్ళినప్పుడు ఆయన్ని అడవుల్లో వదిలిన రథం గుర్రాలు వెనక్కి వెళ్ళడానికి ఇష్టపడలేదు.

బలవంతంగా తీసుకెళ్లారు. అలాంటి రాముడి చరిత్రని ఈ తరానికి అందించబోతున్న ప్రభాస్, డైరెక్టర్ ఓం రౌత్ లకు అభినందనలు అని చినజీయర్ స్వామి అన్నారు. ఇక ఈ మాసివ్ ప్రాజెక్ట్ అయితే ఈ జూన్ 16న వరల్డ్ వైడ్ గా ఇండియాస్ బిగ్గెస్ట్ రిలీజ్ లలో ఒకటిగా రాబోతుంది.

Leave a Reply