Revanth Reddy | కేసీఆర్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

allroudadda

Revanth Reddy | తెలంగాణలో రాజకీయం హాట్ హాట్‌గా నడుస్తోంది. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ముఖ్యంగా.. కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు. అటు అసెంబ్లీలో తీవ్ర విమర్శలు చేయటంతో బీఆర్ఎస్ నేతలు వాకౌట్ చేసిన విషయం తెలిసిందే. కాగా.. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన పోలీస్ కానిస్టేబుళ్ల నియామక ప్రతాల పంపిణీ కార్యక్రమంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్‌ టార్గెట్‌గా ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాబోయే పదేళ్లు తాను సీఎం పదవిలోనే ఉంటానని.. వీలైతే ఒక్క వెంట్రుకైన పీక్కొమ్మను చూస్తా అంటూ కేసీఆర్‌కు సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. వచ్చే పదేళ్లే కాదు.. అందరి ఆశీర్వాదం ఉంటే మరో పదేళ్లు కూడా ఇందిరమ్మ రాజ్యమే ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని..

allroudadda
allroudadda

ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుదోగ్యులను ఇబ్బంది పెట్టిందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వరాష్ట్రం వస్తే.. బాధలు తీరుతాయని నిరుద్యోగులు ఆశించారని.. కానీ ఉద్యోగాలు భర్తీ చేయకుండా యువతను మోసం చేసిందని ఆరోపించారు. తమది ప్రజా ప్రభుత్వమని.. యువత ఎలాంటి ఆందోళన పడొద్దని ధైర్యం చెప్పారు. ఎన్నికల సందర్భంగా చెప్పినట్లుగానే ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామన్నారు రేవంత్ రెడ్డి.

గత ప్రభుత్వం వేసిన చిక్కుముళ్లను ఒక్కొక్కటిగా విప్పుకుంటూ.. ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. టీఎస్పీఎస్పీ బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేశామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.తన కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు లేకపోతే కేసీఆర్ 100 రోజులు కూడా ఆగలేదని.. వెంటనే వాళ్లందరికీ ఉద్యోగాలు ఇచ్చాడని రేవంత్ రెడ్డి విమర్శించారు. మరి తెలంగాణ యువత ఏం అన్యాయం చేసిందని ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రశ్నించారు. అందుకే.. కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రజలు తిరస్కరించారని ఎద్దేవా చేశారు.

Leave a Reply