Priyamani : దేవుడా… ప్రియమణి పిల్లల్ని కనక పోవడం వెనుక అసలు నిజం ఇదేనా..?

తెలుగు, తమిళ, మళయాల చిత్రాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ప్రియమణి . ఒకప్పుడు టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ తన నటనతో పాటు పొదుపైన సొగసైన అందాలతో కుర్రకారు మతిపొగట్టోంది. పెళ్లి అయినప్పటి నుంచి వెండితెరకు దూరమైన ఈ భామ …ఇటీవలె సెకండ్ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ప్రియమణి వైవిధ్యమైన పాత్రలు చేస్తూ రాణిస్తోంది.

అయితే తాజాగా ఈ భామకు సంబంధించిన ఓ వార్త టీ టౌన్‌లో వైరల్‌గా మారింది.రెండేళ్ల క్రితం ప్రియమణి ముస్తఫా రాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ముస్తఫా రాజ్ కు ప్రియమణితో కాకుండా ఇదివరకే పెళ్లయిన విషయం తెలిసిందే.అయినా కూడా ప్రియమణి ఇతడిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది.

అయితే వీరి పెళ్లి జరిగి ఏళ్లు గడుస్తున్నప్పటికీ వీరికి పిల్లలు లేకపోవడం గమనార్హం. ఇప్పటికే వివాహాలు చేసుకున్న ఎంతోమంది సెలబ్రిటీలుపెళ్లి సంవత్సరం కూడా గడవకముందే బిడ్డతో దర్శనమిస్తున్నారు. అయితే ప్రియమణి మాత్రం అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పకపోవడం అభిమానులను మరింత నిరాశకు గురిచేస్తుంది.

నిజానికి ప్రియమణి భర్త ముస్తఫా రాజ్ కు పిల్లలు అంటే చాలా ఇష్టం. కానీ ప్రియమణి మాత్రం ఇప్పుడే పిల్లలు వద్దని భర్తకు చెప్పిందట. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఒక వైపు సినిమాలు.. మరొకవైపు వెబ్ సిరీస్ లో బిజీగా ఉన్న ఈమె ఇలాంటి సమయంలో పిల్లల గురించి ఆలోచిస్తే తన బాడీ ఫిజిక్ మొత్తం మారిపోతుందని.. అంతేకాకుండా సినిమాలలో కూడా అవకాశాలు తగ్గిపోతాయని.. అందుకే ఇప్పుడే పిల్లలు వద్దని భర్తకు చెప్పిందట ఈ ముద్దుగుమ్మ. మొత్తానికైతే ఈ విషయం అభిమానులను మరింత నిరాశకు గురి చేసిందని చెప్పవచ్చు.

Leave a Reply