Samantha-Naga Chaitanya | ఒకే వేదికపై నాగచైతన్య, సమంత.. మళ్ళీ కలవబోతున్నారా,

allroudadda

Samantha-Naga Chaitanya | హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంతల మధ్య విడాకులు గురించి అందరికీ తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్నాళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో సమంత-నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్ అని అందరూ అనుకున్నారు. అయితే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిగా జీవనం కొనసాగిస్తున్నారు. అయితే విడాకుల విషయంపై రెండు వర్గాలుగా విడిపోయిన అభిమానులు.. సమంతదే తప్పు .. నాగ చైతన్యది తప్పు లేదు అంటూ సోషల్ మీడియా వేదికగా ఫైట్ చేసుకున్నారు.

కాగా.. నాగ చైతన్య మరో అమ్మాయితో రిలేషన్‌లో ఉన్నారనే సమంత విడాకులు తీసుకుందని ఆమె అభిమానులు ఆరోపించగా, నటనకు దూరంగా ఉండాలని నాగ చైతన్య చెప్పినప్పటికీ సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ఆమె నుంచి విడిపోయారని నాగ‌చైత‌న్య అభిమానులు చెబుతున్నారు.అయితే.. విడాకుల తర్వాత ఇద్దరూ తమ తమ జీవితాల్లో బిజీ అయిపోయారు.

allroudadda
allroudadda

విడిపోయిన తర్వాత ఈ జంట నేరుగా కలవలేదు. అయితే తాజాగా మార్చ్ 19 సాయంత్రం ముంబైలో అమెజాన్ ప్రైమ్ కంపెనీ తమ ఓటీటీలో రాబోయే సినిమాలు, సిరీస్ ల గురించి స్పెషల్ గా ఓ ఈవెంట్ నిర్వహించగా అన్ని సినీ పరిశ్రమల నుంచి ఆయా సినిమాలకు చెందిన పలువురు సినీ సెలబ్రిటీలు, మూవీ యూనిట్స్ ఈ వేడుకకు హాజరయ్యారు. ఒక్కో సినిమాకి చెందిన వ్యక్తులని స్టేజిపైకి పిలిపించి ఆ సినిమా, సిరీస్ గురించి మాట్లాడించారు.

Indian Railways | ట్రైన్స్ పగలు కంటే రాత్రే ఎందుకు స్పీడ్ గా వెళ్తాయో తెలుసా…?

ఈ క్రమంలో చాలా రోజుల తర్వాత నాగచైతన్య, సమంత ఓకే ఈవెంట్‌లో కనిపించారు. గతంలో వరుణ్ తేజ్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో వీరిద్దరు పాల్గొన్నట్లు తెలుస్తోంది. కానీ చాలా రోజుల త‍రువాత ఓకే కార్యక్రమంలో ఈ జంట ప్రత్యక్షమైంది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అందరూ ఊహించుకున్నట్లు కలిసి మాత్రం వారిద్దరు కనిపించలేదు. ఇద్దరు కూడా వేరు వేరుగా తమ మూవీల ప్రమోషన్స్‌లో భాగంగానే ఈవెంట్‌కు హాజరయ్యారు. విడివిడిగానైనా నాగచైతన్య- సామ్ ఓ ఈవెంట్‌కు హాజరు కావడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.

Leave a Reply