మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ 2021 సెప్టెంబర్ 10న భారీ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయన మృత్యువు అంచుల వరకు వెళ్లివచ్చారు. ఇప్పుడు సాయిధరమ్ది పునర్జన్మ అనే చెప్పుకోవాలి. ఆ రోజు దుర్గం చెరువు వద్ద జరిగిన బైక్ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోవాల్సిన సాయిధరమ్ తేజ్.. దేవుడి దయ, మేనమామల, అభిమానుల ఆశీస్సులతో కోలుకుని నార్మల్ అయ్యాడు.అయితే యాక్సిడెంట్ జరిగిన సమయంలో తనని గుర్తించి హాస్పిటల్కి తీసుకెళ్లిన వ్యక్తిని సాయిధరమ్ తేజ్ ఇటీవల కలిశాడట.
ఈ విషయం తన తాజా ఇంటర్వ్యూలో సాయి ధరమ్ తేజ్ తెలిపారు. అయితే అతనికి మనీ ఏమీ ఇవ్వలేదని సాయిధరమ్ తేజ్ చెప్పాడు. యాక్సిడెంట్ రోజు సయ్యద్ అబ్దుల్ అనే వ్యక్తి సాయిధరమ్ని గుర్తించి అంబులెన్స్కి కాల్ చేశాడనే విషయం ఇంతకు ముందు మెగా బ్రదర్స్ చెప్పారు. దీనికి కారణం కచ్చితంగా మొదట అంబులెన్స్కి కాల్ చేసిన సయ్యద్ అనే చెప్పుకోవాలి.
అందుకే సయ్యద్ని కలిసి సాయిధరమ్ కృతజ్ఞతలు చెప్పాడట అలాగే డబ్బులిచ్చేసి చేతులు దులుపుకుందామని అనుకోలేదు. నా ఫోన్ నెంబర్ ఇచ్చి లైఫ్ లో ఎలాంటి ఇబ్బంది వచ్చినా కాల్ చెయ్యమని చెప్పానుతేజ్ తెలిపాడు..కానీ ఒక ప్రముఖ మీడియా సయ్యద్ ను ఆరాలు తీసింది. దాంతో అసలు బండారం బయటపడింది.
నాకు మెగా ఫ్యామిలీ వాళ్ళు ఎవ్వరూ ఎలాంటి సహాయం చెయ్యలేదు.
అలాగే సాయి ధరమ్ తేజ్ నాకు ఫోన్ నెంబర్ ఇవ్వలేదు. ఇలాంటి ఫేక్ న్యూస్ వల్ల నాకు నష్టమే తప్ప లాభం ఏమీ జరగలేదు` అని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, గతంలో సయ్యద్ హైదరాబాద్ నిజాం పెట్లోని CMR లో పని చేస్తూ ఉండే వాడు. తేజ్ యాక్సిడెంట్ తర్వాత అక్కడికి వచ్చే ప్రతీ ఒక్కరు నీకు మెగా ఫ్యామిలీ ఎంత ఇచ్చింది అంటూ ప్రశ్నలతో టార్చర్ చేసేవారట. వాళ్ల టార్చర్ తట్టుకోలేక సయ్యద్ అక్కడ జాబ్ కూడా మానేశాడట. పాపం ఇప్పుడు అమెజాన్ కోసం పని చేస్తున్నాడట.