Urvashi Rautela | బాలీవుడ్ లో నటిగా, ఐటెమ్ గర్ల్ గా దుమ్మురేపుతోంది అందాల తార ఊర్వశి రౌతేలా. పలు బాలీవుడ్ సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఐటెమ్ సాంగ్స్ మీద ఫుల్ ఫోకస్ పెట్టింది. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా వరుసగా స్పెషల్ సాంగ్స్ చేస్తూ కుర్రకారుకు కిక్కెక్కిస్తోంది. తాజాగా తెలుగులోనూ తన ఒంపుసొంపులతో సినీ లవర్స్ ను ఆకట్టుకుంది. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ కలిసి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ‘బాస్ పార్టీ’ సాంగ్ తో దుమ్మురేపింది.
ఆ తర్వాత అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’ సినిమాతో స్పెషల్ సాంగ్ చేసింది.తాజాగా అందాల తార ఊర్వశి రౌతేలా ఆదివారం (ఫిబ్రవరి 25వ తేదీ తన 30వ పుట్టినరోజుని జరుపుకుంది. ఈ పుట్టినరోజుకు మామూలు ప్రత్యేకత లేదు.ఆమె పుట్టినరోజుకు ప్రఖ్యాత గాయకుడు యోయో హనీ సింగ్ ఆమె కోసం ప్రత్యేకంగా కేక్ తయారుచేయించాడు. ఆ కేక్ విలువ అక్షరాలా మూడు కోట్ల విలువ ఉంటుంది. అంతలా కేక్ ధర ఉండడానికి కారణం ఆ కేక్ 24 క్యారెట్ల బంగారం పూత పూసి ఉంది.
ప్రత్యేకంగా తయారుచేసిన ఈ కేక్ను చూసి ఆ హీరోయిన్ ఉబ్బితబ్బిబయ్యింది. ఈ వార్త తెలిసిన నెటిజన్లు హీరోయిన్ను మరచిపోయి అంతా కేక్ గురించే చర్చించుకుంటున్నారు. ఈ కేక్కు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్గా మారాయి.ప్రస్తుతం ఊర్వశి రౌతౌలా ‘లవ్ డోస్ 2’ ప్రాజెక్టుకు పని చేస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు చిత్రీకరణ సాగుతోంది. షూటింగ్ సెట్లోనే రౌతౌలాతో యోయో హనీసింగ్ కేక్ కోయించాడు. ఈ విషయాన్ని ఊర్వశీ తన సోషల్ మీడియాలో పంచుకుంది. ‘నా ప్రయాణంలో నీ పాత్ర మరువలేనిది. నువ్వు హాజరుకావడం చాలా ఆనందంగా ఉంది. నీ కృషి, సహాయంతో నేను జీవితంలో ఈ స్థాయిలో ఉన్నా’ అని ఊర్వశీ తన ఇన్స్టాగ్రామ్లో రాసుకుంది.