2014లో తెలుగు దేశం పార్టీ ద్వారా విడదల రజిని రాజకీయాల్లోకి ఎంటరయ్యారు. చిలకలూరిపేట నియోజకవర్గంపై గురిపెట్టిన ఆమె 2018లో వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఇటీవల వైసీపీ మంత్రివర్గ పునర్వవ్యవస్తీకరణలో ఆమెకు మంత్రిగా కూడా అవకాశం దక్కింది.అయితే, రజినీ గురించి సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.
ఆ వార్త ఏంటంటే.. ఆమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారని నెట్టింటా గత రెండు రోజులుగా విస్తృత ప్రచారం జరుగుతోంది. సినిమా నిర్మాణ రంగంలో తన అభిరుచిని చాటుకునేందుకు రజిని ప్రయత్నాలు ప్రారంభించారని అందుకు ఒక బ్యానర్ను కూడా మొదలెట్టే యోచనలో ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఇందుకోసం హైదరాబాద్ లో ఒక ఆఫీసుని కూడా ఆమె రెడీ చేస్తున్నట్లు కొన్ని రూమర్లు వస్తున్నాయి.
టాలీవుడ్ లో నిర్మాతగా రజిని ఎంట్రీ కోసం అంతా రెడీ చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.త్వరలోనే డైరెక్టర్, హీరో, హీరోయిన్లు ఇంకా అలాగే ఇతర టెక్నీషియన్లను ఫైనలేజ్ చేసి అధికారికంగా ప్రకటించనున్నారని వార్తలు వచ్చాయి.అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తేలింది. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంత్రి విడదల రజినీ ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు కేవలం ఒట్టి పుకార్లేనని స్పష్టమైంది. దీంతో ఈ రూమర్లకు చెక్ పడింది.