Food | అన్నం తిన్నాక ప్లేట్‌లోనే చేయి కడుగుతున్నారా..? అయితే మీరు ఇది తెల్సుకోవాల్సిందే,

Food | సాధారణంగా మనం భోజనం చేసిన తరువాత ఎక్కువమంది మనం తిన్న ప్లేట్లోనే చేతులు కడగడం చేస్తుంటారు. ఇలా తిన్న ప్లేట్ లోనే చేతులు కడగడం మంచిదని పెద్దవాళ్లు కూడా చెబుతుంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనం తిన్న ప్లేట్ లోనే చేయి కడగడం పూర్తిగా తప్పని పండితులు చెబుతున్నారు. భోజనాన్ని చేత్తో చేసినా లేదా స్పూన్‌తో తిన్నా.. చేతుల‌ను మాత్రం తిన్న ప్లేట్‌లోనే క‌డ‌గ‌రాదు. ఇలా చేస్తే.. అన్న‌పూర్ణా దేవితోపాటు ల‌క్ష్మీదేవికి కూడా కోపం వ‌స్తుంద‌ట‌.

ఎందుకంటే మ‌నం తినే ఆహారం ఎంతో ప‌విత్ర‌మైంది. అలాంటి ఆహారాన్ని తిన్న ప్లేట్‌లోనే చేతుల‌ను క‌డ‌గడం అంటే పాపం చేసిన‌ట్లే. భోజ‌నం చేశాక ఎట్టి ప‌రిస్థితిలోనూ ప్లేట్‌లో చేతుల‌ను క‌డ‌గ‌రాదు.అలాగే భోజనం ఉన్న ప్లేట్‌ను కేవ‌లం ఒకే చేత్తో ప‌ట్టుకోకూడదు… అలా చేసినా కూడా అన్న‌పూర్ణా దేవిని, ల‌క్ష్మీదేవిని అవ‌మానించిన‌ట్లే అవుతంద‌ట‌. దీంతో వారికి ఆహారం, డ‌బ్బు ఉండ‌ద‌ని పండితులు చెబుతున్నారు. కాబ‌ట్టి భోజ‌నం విష‌యంలో ఈ జాగ్ర‌త్త‌ల‌ను త‌ప్ప‌కుండా పాటించాలి.

Food
Food

భోజ‌నం చేసేట‌ప్పుడు భోజ‌నంపైనే దృష్టి పెట్టాలి. పూర్వకాలంలో అయితే కుటుంబ సభ్యులంతా ఒకే దగ్గర కుర్చోని కబుర్లు చెప్పుకుంటూ తినేవాళ్లు.. ఇప్పుడు కూడా డైనింగ్‌ టేబుల్స్‌పై కుర్చోని తింటున్నారు.. కానీ ఫోన్ లేదా టీవీ చూస్తూ.. కొంద‌రు పుస్త‌కాలు చ‌దువుతూ తింటారు. ఇలా చేసినా కూడా మ‌నం తినే ఆహారాన్ని అవ‌మానించిన‌ట్లే అవుతుంద‌ట‌.ఈ విధంగా కూడా చేయ‌కూడ‌దు.

ఇది కూడా చదవండి:  తాను చనిపోతూ ఏడుగురిలో వెలుగులు నింపింది!

భోజ‌నం చేసేట‌ప్పుడు ధ్యాస అంతా మ‌నం తినే ఆహారంపైనే ఉండాలి. ఎంతో శ్ర‌ద్ధ‌గా, ఎలాంటి కోపం, ఆవేశాలు లేకుండా ప్ర‌శాంతంగా భోజ‌నం చేయాలి. మీరే గమనించండి.. మనం తినేప్పుడు ఎవరైనా వచ్చినా, ఎవరైనా కాల్ చేసినా.. అరే తింటున్నా అంటే.. వాళ్లు సరే తిన్నాక ఫోన్‌ చేయమంటారు. తిన్నాక రమ్మంటారు.. భోజనం చేసేప్పుడు డిస్టబ్‌ చేయకూడదని అర్థం.. భోజనాన్ని ఎంత ఇష్టంగా తింటారో అప్పుడే అన్న‌పూర్ణా దేవి సంతోషిస్తుంది.

Food
Food

మ‌న ఇంట్లో భోజ‌నానికి లోటు లేకుండా చూస్తుంది. దీంతోపాటు ఆర్థిక స‌మ‌స్య‌లు కూడా రావు.. కొంతమంది ఇష్టం లేని కూర వండితే.. ముఖం అంతా మాడ్చుకోని చాలా చిరాకుగా తింటారు. ఎందుకట్లా.. అది ఆ పూట మాత్రమే కదా.. రేపు మళ్లీ వేరే కూర వస్తుంది.. ఆ మాత్రం దానికి ఎందుకు ఆస్తులంతా పోయినట్లు బీహేవ్‌ చేస్తారు. భోజనాన్ని ప్రేమతో, ప్రశాంతంగా, ఏకాగ్రతగా తిన్నవారికే ఏ లోటు లేకుండా ఉంటుందని పండితులు అంటున్నారు. మీరు ఈ తప్పులు చేస్తుంటే ఇక మారండి.! మార్చుకోండి.!

ఇది కూడా చదవండి: చంద్రబాబుకి బెయిలా.. జైలా.. కొనసాగుతున్న ఉత్కంఠ..?

Leave a Reply