Keerthy Suresh : ముఖంపై గాయాలతో కీర్తి సురేష్‏కు ఏమైంది..?

ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లలో ఇటువంటి పాత్ర ఇచ్చిన చేసేవారిలో మొదటి వరుసలో ఉండేది కీర్తి సురేష్. దీంతో ఈ ముద్దుగుమ్మ బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకుంటూ ఉంది. ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను అలరిస్తూ ఉంటది. ఇటీవలే దసరా సినిమాతో తిరుగులేని విజయాన్ని అందుకుంది. క్యారెక్టర్ నచ్చితే ఎంత గ్లామర్ గా కనిపించడానికి సిద్ధమయ్యే కీర్తి సురేష్…“దసరా” సినిమా కోసం డి గ్లామర్ గా నటించి ఊహించని విజయాన్ని అందుకుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు తమిళంలో “సానికాయుధం” అనే మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో మరీ క్రూరంగా కనిపిస్తుంది. సామూహికంగా అత్యాచారం చేయబడి.. ఆ తర్వాత బాగా చేర్చుకునే అమ్మాయిగా.. ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర కనిపించనుంది. ఈ పాత్ర కోసం చాలా హార్డ్ వర్క్… చేస్తోంది.అయితే ఇటీవల ఆమె మొహంపై గాయాలైన ఒక వీడియోను ఆమె ఇన్ స్టా వేదికగా పోస్ట్ చేసింది. ఆమె ఎడమ కంటికి కింది భాగంలో తీవ్రంగా గాయమైంది. దీంతో ఆమె అభిమానులు వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.

‘అసలు కీర్తికి ఏమైంది’ అంటూ పోస్టులపై పోస్టులు పెడుతున్నారు.ఇది గమనించిన కీర్తి సురేశ్ తన అభిమానులను ఇంకా టెన్షన్ పెట్టకుండా అసలు విషయం చెప్పింది. తను షూటింగ్ కోసమే ఈ మేకప్ వేసుకున్నట్లు స్పష్టం చేసింది కీర్తి. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘సాని కాయిదం’. ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటించారు. గత సంవత్సరం 6 మే, 2022న అమేజాన్ ప్రైమ్ లో ఈ సినిమా విడుదలైంది.

ఈ మూవీ వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆమె ఈ వీడియోను సోషల్ మీడియా వేధికగా, ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఈ సినిమా చిత్రీకరణలో ఆమె పడిన శ్రమను గుర్తు చేసుకుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. ‘సాని కాయిదం’ మూవీలో ఆమె డెడికేషన్ చూసిన ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. సినిమాల విషయానికి వస్తే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న మూవీ భోళా శంకర్ లో నటిస్తోంది.

Leave a Reply