Keerthi Suresh: కిలాడీ లేడీ.. డీపీగా కీర్తి సురేష్‌ ఫొటోతో 40 లక్షలు కొట్టేసింది..! ఎలా అంటే.

కర్ణాటక(Karnataka) రాష్ట్రంలోని విజయపూర్ జిల్లా సిందగి తాలూకాలోని బగలూరు గ్రామానికి చెందిన పరశురామ అనే యువకుడు హైదరాబాద్‌లో భవన నిర్మాణ కార్మికులకు సూపర్‌వైజర్‌గా ఉద్యోగం చేస్తూ నెలకు రూ. 30 వేల జీతం తీసుకుంటున్నాడు. పరశురామకు ఫేస్ బుక్ లో హాసన్‌కు చెందిన మంజుల అనే ఇద్దరు పిల్లలు ఉన్న మహిళతో పరిచయం ఏర్పడింది. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అదేంటంటే..మంజుల తన ఫేస్ బుక్ డీపీ దగ్గర తన ఫొటోకి బదులుగా కీర్తి సురేష్ ఫొటోని ఉంచింది.

ఆమె ఫేస్ బుక్ డీపీని చూసి మైమరచిపోయాడు. అయితే అది హీరోయిన్ ఫొటో అని పరశురామకి తెలియదు. తనకు పరిచమైన అమ్మాయి హీరోయిన్ లా ఉందని పరశురామ తెగ మురిసిపోయేవాడు. గాల్లో తేలిపోతుండేవాడు. ఫేస్ బుక్ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ రోజూ చాటింగ్ లో మునిగితేలేవారు. ఈ క్రమంలో మంజుల తనకు చాలా ఆర్థిక కష్టాలు ఉన్నాయి,తాను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పడం ప్రారంభించింది.

ఆమె మాటలకు కరిగిపోయాడు పరశురాయ. ఆమె చదువుల కోసం ఇంట్లో పొదుపు చేసిన ఐదు లక్షల నగదు, ప్లాట్‌తో సహా అన్నీ అమ్మేసి ఆమె చదువుకు డబ్బులు పంపేవాడు. ఫోన్ పే ద్వారా సుమారు 40 లక్షల వరకు డబ్బులు పంపినప్పటికీ అతడు ఆమెను కలవలేదు. ఎన్నిసార్లు కలుద్దామన్నా ఇప్పుడు కాదు అప్పుడు కాదు అంటూ తప్పించుకునేది మంజుల. ఏదో తేడా కొడుతుంది అని భావించిన పరశురామ తన డబ్బులు తనకు ఇచ్చేయాలని అడిగాడు.

దీంతో మంజుల ఓ ఫ్లాన్ వేసింది. అదేంటంటే..ఓ రోజు పరశురామకి తన ఫేస్ కనబడకుండా వీడియో కాల్ చేసి మాట్లాడుతుండగా…నువ్వు నాతో మాట్లాడుతూ స్నానం చేయ్యి అని పరశురామకి చెప్పింది. దానికి పరశురామ సంతోషంతో గంతులేస్తూ స్నానం చేస్తూ వీడియో కాల్ మాట్లాడాడు. అయితే పరశురామ స్నానం చేస్తుండగా వీడియో కాల్ చేసి రికార్డు చేసింది మంజుల. ఆ తర్వాత ఆ వీడియో గురించి పరశురామకి తెలిపి.. బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించింది మంజుల.

Leave a Reply