Young Woman | అప్పటి వరకు తమతో ఆనందంగా గడిపిన వారు ఒక్కసారిగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు పడే వేధన వర్ణనాతీతంగా ఉంటుంది. ఇదే రీతిలో ఆంధ్రప్రదేశ్ లో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కూతురు ప్రమాదానికి గురై చనిపోవడంతో గుండెలవిసేలా రోదించారు. కానీ ఆ యువతి తాను చనిపోతూ కొందరికి ప్రాణం పోసి మరణాన్ని జయించింది.
పుట్టెడు దుఖంలో ఉన్న ఆ యువతి తల్లిదండ్రులు అవయవదానానికి ఒప్పుకోవడంతో ఏడు మంది పేషెంట్లకు కొత్త జీవితాన్ని అందించినట్లైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..పిచ్చాటూరు మండలం రామాపురం దళితవాడకు చెందిన సంపత్ కుమార్, అమ్ములు దంపతులకు ముగ్గురు కుమార్తెలు కీర్తి, స్వాతి, శృతి,ఒక కుమారుడు సారఽథి ఉన్నారు. పెద్ద కుమార్తె కీర్తి బీకాం వరకు చదువుకుని చెన్నైలోని ఓ కాల్ సెంటర్లో పని చేస్తోంది.
ఈ నెల 3వ తేదీన గుమ్మిడిపూండిలో జరిగిన స్నేహితురాలి వివాహానికి హాజరై బంధువుతో కలిసి సొంతూరుకు బయల్దేరింది. వీరు ప్రయాణిస్తున్న బైకు తిరువళ్ళూరు జిల్లా కరడిపుత్తూరు వద్ద ఒక వంతెనను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బంధువు గాయాలతో తప్పించుకోగా, కీర్తి తలకు బలమైన గాయం తగిలింది. దీంతో ఆమెను తొలుత స్థానిక ఆస్పత్రిలో చేర్చి ప్రాథమిక చికిత్స అనంతరం చెన్నై రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: Actress Rashi | స్టార్ హీరోయిన్ రాశికి ఎన్ని పెళ్లిళ్లు అయ్యాయో తెలుసా ?
ఏడుగురి జీవితాల్లో వెలుగు నింపిన కీర్తి..
అక్కడి వైద్యులు కీర్తి బ్రెయిన్డెడ్ కావడం వల్ల బతికే అవకాశం లేదని ఆమె తల్లిదండ్రులకు చెప్పారు. అవయవదానంపై వైద్యులు అవగాహన కల్పించడంతో ఆమె తల్లిదండ్రులు అవయవదానానికి ఒప్పుకున్నారు. కీర్తి దేహం నుంచి గుండె, కిడ్నీలు రెండు, రెండు కళ్లు, లివర్, లంగ్స్, హార్ట్ వాల్యూలను తీసి డాక్టర్లు భద్రపరి చాక తల్లిదండ్రులకు పార్థివదేహాన్ని మంగళవారం అప్పగించారు. బుధవారం స్వగ్రామమైన రామాపురం దళితవాడలో కీర్తికి అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు ఎమ్మెల్యే ఆదిమూలం తదితరులు కీర్తి మృతదేహానికి నివాళులర్పించారు.
ఇది కూడా చదవండి: Roja Daughter | స్టార్ హీరో కొడుకుతో రొమాన్స్ చేయనున్న రోజా కూతురు..!