Amrapali IAS | ఆమ్రపాలికి కీలక పోస్టు..ఇంకా తెలంగాణ షేక్ అవ్వాల్సిందే..

Amrapali IAS

Amrapali IAS | 2018లో తెలంగాణ ఎన్నికల సంయుక్త ప్రధానాధికారిగా కూడా ఆమ్రపాలి పనిచేశారు. అంతకుముందు జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్‌గానూ ఆమె పనిచేశారు. తాను పనిచేసిన వివిధ హోదాల్లో ఆమె తన ముద్రను వేసి మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు.నిజానికి డైనమిక్ ఆఫీసర్‌గా పేరున్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి రేవంత్ టీంలో చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల కేంద్ర సర్వీసులో ఆమె డిప్యూటేషన్ పూర్తి కావడంతో రాష్ట్ర సర్వీసులో చేరనున్నారు.

ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డిని సోమవారం ఆమ్రపాలి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె రిపోర్ట్ చేశారు.అయితే ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఆమ్రపాలి రాష్ట్ర విభజన తర్వాత వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. తన పని తీరుతో డైనమిక్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్నారామె. 2020లో ఆమ్రపాలికి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి పిలుపు రావడంతో అక్కడే డిప్యూటీ కార్యదర్శిగా పనిచేశారు.

ఆమ్రపాలికి కీలక పోస్టు..Amrapali IAS

అక్కడ డిప్యూటేషన్ పూర్తి కావడంతో ఇప్పుడు మళ్లీ తెలంగాణ ప్రభుత్వంలోకి వచ్చారు. ఈ మేరకు ఇక్కడ రిపోర్టు చేసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.ఆయనకు పుష్పగుచ్ఛం సమర్పించి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వంలో ఆమె వివిధ హోదాల్లో పనిచేశారు. 2018లో తెలంగాణ ఎన్నికల సంయుక్త ప్రధానాధికారిగా కూడా ఆమ్రపాలి పనిచేశారు. అంతకుముందు జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్‌గానూ ఆమె పనిచేశారు. తాను పనిచేసిన వివిధ హోదాల్లో ఆమె తన ముద్రను వేసి మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు.

Leave a Reply