Varalaxmi Sarathkumar: బుల్లెట్ బండిపై బాలయ్య చెల్లల్లు .. వీడియో వైరల్‌!

Varalaxmi Sarathkumar | తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని నటి వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar)‌. క్రాక్‌ సినిమాలో జయమ్మగా సూపర్ యాక్టింగ్‌తో అదరగొట్టేసిన ఈ భామ.. ఇటీవలే వీరసింహారెడ్డిలో ఫుల్ లెంగ్త్‌ రోల్‌లో మెరిసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. వరలక్ష్మి శరత్‌కుమార్‌ నేడు 38వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నెటిజన్లు, అభిమానులు, మూవీ లవర్స్‌ విషెస్‌ తెలియజేస్తున్నారు.

బర్త్‌ డే కానుకగా గీతాఆర్ట్స్‌ 2 బ్యానర్‌ వరలక్ష్మి శరత్‌కుమార్‌తో కొత్త సినిమా ప్రకటించింది.జోహార్‌ ఫేం తేజ మర్ని దర్శకత్వంలో ఈ మూవీ ప్రొడక్షన్‌ నంబర్ 8గా వస్తోంది. మలయాళ హిట్‌ సినిమా నాయట్టు చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. సర్వైవల్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ పోలీసాఫీసర్‌ రజియా అలీ పాత్రలో నటిస్తోంది.

అది పక్కన పెడితే నటిగా దశాబ్దం పూర్తి చేసుకున్న వరలక్ష్మి శరత్‌కుమార్‌ ఇప్పటి వరకు కొన్ని కారణాల వల్ల సైకిల్‌ తొక్కడం లాంటి వాటి జోలికి పోలేదట. అయితే ఇప్పుడు ఏకంగా బుల్లెట్‌ ఎక్కేవారు. సైకిల్‌ నుంచి స్టెప్‌ బై స్టెప్‌ బుల్లెట్‌ నడపడం వరకు నేర్చేసుకున్నారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడంతో అది తెగ వైరల్‌ అవుతోంది.

దీని గురించి ఆమె పేర్కొంటూ బాల్యంలో కొన్ని కారణాల వల్ల తనకు బైక్‌ తోలడానికి ఇంట్లో అనుమతి ఇవ్వలేదన్నారు. అయితే బైక్‌ నడపడానికి భయాన్ని పోగొట్టడానికి ఇది సరైన టైమ్‌ అని భావించానన్నారు. దీంతో గత వారం బైక్‌ నడపడానికి తొలి మెట్టు అయిన సైకిల్‌ తొక్కడం నేర్చుకున్నానని, ఆ తరువాత స్క్రూటీ, ఇప్పుడు బుల్లెట్‌ కూడా నడుపుతున్నానని చెప్పారు.

Leave a Reply