పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కాంబినేషన్ లో వచ్చిన ‘బ్రో’ మూవీ చుట్టూ ఏపీ పాలిటిక్స్ తిరుగుతున్నాయి. జులై 28న రిలీజ్ అయిన ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకొని ఆల్రెడీ మూడు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. అయితే ఈ సినిమాలో ‘శ్యాంబాబు’ అనే పాత్ర ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఇరిగేషన్ మంత్రి ‘అంబటి రాంబాబు’ని పోలి ఉంది అంటూ..
ఆడియన్స్ మాట్లాడడం, అందుకు సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట వైరల్ అవ్వడంతో అంబటి దానిపై రెస్పాండ్ అయ్యారు.ఈ క్రమంలోనే పవన్ పై విమర్శలు చేస్తూ, బ్రో మూవీ కలెక్షన్స్ లెక్కలు చెబుతూ గత మూడు రోజుల నుంచి అంబటి మీడియా ముందు హడావిడి చేస్తూ వస్తున్నారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ బ్రో సినిమాని, పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తున్నారు.
బ్రో సినిమా లావాదేవీలపై అనుమానాలు ఉన్నాయంటూ దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తానని అన్నారు. ఢిల్లీలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డితో మాట్లాడిన తర్వాత తమ పార్టీ నేతలతో కలిసి దర్యాప్తు సంస్థలకు అంబటి పిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.ఈ విషయంలో అంబటిపై విమర్శలు దారుణంగా వస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే ట్రోల్స్ కూడా భారీగా వస్తున్నాయి.
ఒక ఇరిగేషన్ మినిష్టర్ అయి ఉండి ప్రజల గురించి, ఏపీ గురించి, పోలవరం లెక్కల గురించి మాట్లాడకుండా ఇలా ఒక సినిమా కలెక్షన్స్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని నెటిజన్లు, ప్రజలు విమర్శలు చేస్తున్నారు. అయితే అంబటి చేసే హడావిడి బ్రో సినిమాకి నెగిటివ్ కంటే పాజిటివ్ అవ్వడం విశేషం.తాజాగా ఈ అంశంపై చందబాబు మాట్లాడుతూ ఈ పదవి గురించి నువ్వు పూర్తిగా తెలుసుకో.. సినిమాల గురించి నీకు ఎందుకు అంటూ అంబటి రాంబాబుపై చంద్రబాబు ఫైర్ అయ్యారు.