Pawan Kalyan | సముద్రఖని దర్శకుత్వం వహించిన పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘బ్రో’. ఈ శుక్రవారం (జులై 28) ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సముద్రఖని దర్శకుత్వం వహించిన చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. నిన్న రాత్రి హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన పి.సముద్రఖని నేను ఏదీ ప్లాన్ చేయలేదు. దర్శకుడిగా ఇది నా 15 వ సినిమా. ఈ 15 సినిమాలకు నేనేది ప్లాన్ చేయలేదు. 1994లో అసిస్టెంట్ డైరెక్టర్గా నా ప్రయాణం మొదలైంది. అప్పటినుంచి నా పని నేను చూసుకుంటూ, జయాపజయాలతో సంబంధం లేకుండా ముందుకు సాగుతున్నాను. బుల్లితెర మీద నా ప్రతిభ చూసి ఎస్.పి.చరణ్ గారు నాకు మొదటి సినిమా అవకాశమిచ్చారు.
మన పని మనం సరిగ్గా చేస్తుంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయి. వచ్చిన అవకాశాలను మనం సద్వినియోగం చేసుకోవాలి.అలాగే ఈ కథ చాలా గొప్పది ఎక్కువ మందికి చేరువ చెయ్యాలని, కళ్యాణ్ గారితో చేస్తే బాగుంటుందని త్రివిక్రమ్ గారు చెప్పగానే ఒక్కసారిగా మాటల్లో చెప్పలేని ఆనందం కలిగింది.
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలయికలో కొన్ని మార్పులతో చేస్తే బాగుంటుందని ఆయనే చెప్పారు. అలా కళ్యాణ్ గారికి కథ నచ్చడంతో వెంటనే సినిమా పని మొదలైంది. కాలమే త్రివిక్రమ్ గారిని, కళ్యాణ్ గారిని ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చింది.