YS jagan | సీఎం జగన్ కుమార్తెలు ఇప్పుడు ఏమి చేస్తున్నారో తెలుసా?

YS jagan | తండ్రి ముఖ్యమంత్రి, తాత కూడా అప్పట్లో ముఖ్యమంత్రి. ఇలాంటి కుటుంబంలో పుట్టిన పిల్లలు ఎంత గారాబంగా పెరుగుతారు, ఎంత హంగు, ఆర్భాటాలతో ఉంటారో మనం ఊహించగలం. కానీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కుమార్తెలు మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. అసలు వారిద్దరూ ఎక్కడుంటారు, ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారనే విషయం అతి కొద్దిమంది కుటుంబ సన్నిహితులకు మినహా ఇంకెవరికీ తెలియదు.

వారి చిన్నప్పటి ఫొటోలు ఇంటర్నెట్ లో దొరుకుతాయి కానీ, ఇప్పుడు వారు ఎలా ఉన్నారనే విషయం ఎక్కడ వెదికినా కనిపించదు. అంత లో ప్రొఫైల్ మెయింటెన్ చేస్తుంటారు జగన్ కుమార్తెలు.కనీసం సోషల్ మీడియాలో కూడా ఎక్కడా వారి హడావిడి కనిపించదు. కారణం చదువు, చదువు, చదువు. వారికి చదువే లోకం, చదువే వారి ప్రపంచం. కుమార్తెలను కలిసేందుకు జగన్, ఆయన సతీమణి భారతి అప్పుడప్పుడు ఫారన్ వెళ్ళి వస్తారు.

ప్రస్తుతం హర్షా ఫ్రాన్స్‌లోని ఫోంటైన్‌బ్లూలోని ఇన్‌సీడ్ బిజినెస్ స్కూల్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని తీసుకుంది. ప్రస్తుతం ఆమె ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది.జగన్ మోహన్ రెడ్డి చిన్న కుమార్తె వర్ష రెడ్డి యూనివర్శిటీ నోట్రే డామ్, ఇండియానా, USA లో చదువుతున్నారు.

జగన్ మోహన్ రెడ్డి తన కుటుంబం మరియు పిల్లల వివరాల గురించి చాలా వరకు గోప్యంగా ఉంచారు. ఆయన పెద్ద కుమార్తె UKలోని ప్రతిష్టాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE) నుండి డిగ్రీని పొందారు మరియు తర్వాత ఫ్రాన్స్‌లోని INSEAD బిజినెస్ స్కూల్‌లో చేరారు.

Leave a Reply