Bandaru | మా నాయకుడు వచ్చాక నీకు చుక్కల చూపిస్తా..బండారు సత్యనారాయణ.

Bandaru | మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తిని వదిలిపెట్టేది లేదని మంత్రి ఆర్‌కే రోజా మరోసారి వార్నింగ్ ఇచ్చారు. తనపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంతో బాధిస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఒక మనిషి చనిపోతే కొన్ని రోజులే బాధపడతారని… కానీ తాను ఈ నిందలను జీవితాంతం భరించాల్సిందేనా అని ఆవేదన వ్యక్తం చేశారు.ఒక మహిళగా తాను సినీ రంగంలోకి ప్రవేశించి ఎలా ఎదిగానో అందరికీ తెలుసునని రోజా అన్నారు. ఎలాంటి బ్యాక్‌ సపోర్ట్ లేకుండా అటు సినీనటిగా పేరు తెచ్చుకున్నానని..

అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించానని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనకు టికెట్ ఇచ్చి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిని చేశారని అన్నారు. ఇంత కష్టపడి పైకి వచ్చిన తనపై ఇలాంటి దుర్మార్గపు మాటలు మాట్లాడటంపై దారుణమని మండిపడ్డారు. ఒక మంత్రిగా ఉన్న తనపైనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సామాన్య మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.దానిపై బండారు సత్యనారాయణ మాట్లాడుతూ ఇప్పటికే తెలుగు దేశం పార్టీ చేపట్టిన కార్యక్రమాలు చూసి వైసీపీకి చెమటలు పడుతున్నాయి.

నీ నిజాయితీ ఏంటో నీ ఆస్తులు ప్రకటించి నిరూపించుకో. పవన్ కళ్యాణ్‌తో కలిసి బలమైన ప్రభుత్వాన్ని నిర్మిస్తాం. రోజా గురించి తెలుసు కాబట్టి వైసీపీ సోదరీమణులు ఎవరు స్పందించడం లేదు’’ అంటూ బండారు సత్యనారాయణ వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించడం, విమర్శించడం రాజకీయ నాయకుల హక్కు అని మాజీ మంత్రి తెదేపా సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. గుంటూరు పోలీసులు 41 ఏ నోటిసులిచ్చి విచారణకు పిలవగా.. తాను అరండల్‌పేట స్టేషన్‌కు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

Leave a Reply