Chiranjeevi| దేశవ్యాప్తంగా రక్షా బంధన్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. మహిళలు తమ అన్నలు, తమ్ముళ్లకు రాఖీలు కట్టి ఆశీస్సులు అందుకుంటున్నారు. తాజాగా, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి కూడా ఆయన తోబుట్టువులు రాఖీ కట్టారు. విజయదుర్గ, మాధవి తమ అన్నయ్యకు రాఖీ కట్టి ఆయన నుంచి కానుకలు అందుకున్నారు.’
ఈ సందర్భంగా చిరంజీవి చెల్లెళ్లకు ఆశీస్సులు అందించారు. చెల్లెళ్ల రాకతో చిరంజీవి నివాసంలో కోలాహలం నెలకొంది. దీనికి సంబంధించిన ఫొటోలను చిరంజీవి ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో పంచుకున్నారు. హ్యాపీ రక్షాబంధన్… అందరికీ రాఖీ శుభాకాంక్షలు అంటూ స్పందించారు.
ఇకపోతే చిరంజీవి ఇటీవల భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ వేదాళం
కు రీమేక్ ఇది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా(Tamannaah) హీరోయిన్ గా నటించింది. కీర్తి సురేష్ కీలక పాత్రను పోషించింది. భారీ అంచనాల నడుమ విడుదలైన భోళా శంకర్.. బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది. బయ్యర్లకు భారీ నష్టాలను మిగిల్చింది.
ప్రస్తుతం చిరంజీవి తన తదుపరి ప్రాజెక్ట్ లపై దృష్టించారు. ఇటీవల మెగా 156(Mega 156), మెగా 157 సినిమాలపై అప్డేట్స్ వచ్చాయి. మెగా 156 మూవీని చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల తన ఓన్ బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మించబోతోంది.బంగార్రాజు ఫేమ్ కళ్యాణ్ కృష్ణ ఈ మూవీకి దర్శకుడు. అలాగే మెగా 157ను యూవీ క్రియేషన్స్ వారు నిర్మించబోతున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ రెండు చిత్రాలను ఒకేసారి కంప్లీట్ చేసే ఆలోచనలో చిరంజీవి ఉన్నాడు.