Dil Raju | టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకున్నది. దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి (86) కన్నుమూశారు. గతకొంతకాలంగా శ్యాంసుందర్రెడ్డి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. శ్యామ్ సుందర్రెడ్డికి ముగ్గురు సంతానం. విజయ్ సింహారెడ్డి, నరసింహారెడ్డి, దిల్ రాజు ఉన్నారు. దిల్ రాజు అసలు పేరు వెంకట రమణారెడ్డి.
చిన్నతనం నుంచే ఆయనను కుటుంబ సభ్యులంతా రాజు అంటూ పిలుచుకునే వారు. ఆయన స్వస్థలం నిజామాబాద్ జిల్లా కాగా.. పైచదువుల కోసం హైదరాబాద్కు వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. సినీ పరిశ్రమలోకి వచ్చే ముందు దిల్ రాజు పలు వ్యాపారాలు నిర్వహించారు. ఆ తర్వాత సినీ డిస్ట్రిబ్యూటర్గా.. ఆ తర్వాత ‘దిల్’ సినిమాతో నిర్మాతగా మారారు.
ఆ సినిమా హిట్ కావడంతో అప్పటి నుంచి ఆయన ‘దిల్ రాజు’గా మారింది. దిల్ రాజు ఇంటికి వెళ్లిన చిరంజీవి… శ్యాం సుందర్ రెడ్డికి నివాళి అర్పించారు. మరోవైపు దిల్ రాజు తండ్రి అంత్యక్రియల్లో ప్రకాశ్ రాజ్ స్వయంగా పాల్గొన్నారు. దిల్ రాజుకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా తన బాధను ఆపుకోలేక పోయిన దిల్ రాజు… ప్రకాశ్ రాజ్ ను పట్టుకుని భోరుమని ఏడ్చారు.