Viral | పాపం మనిషి జీవితం ఇంతేనా.. క్షణాల్లో ప్రాణం పోయింది? ఏం జరిగింది అంటే.

water heater | ఇటీవల కాలంలో మనిషి జీవితం నీటి బుడగలా మారిపోయింది. ఎప్పుడు మృత్యువు ముంచుకొస్తోంది అన్న విషయాన్ని చెప్పలేని విధంగా మారిపోయింది. ఇక మారుతున్న జీవన శైలికి తగ్గట్టుగానే అటు మనిషికి మరణం సంభవించే తీరు కూడా మారిపోతుంది అని చెప్పాలి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఎంతోమందిని సడన్ స్ట్రోక్ క్షణాల వ్యవధిలో ప్రాణాలు తీస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.

అప్పటి వరకు ఎంతో ఆనందంగా గడిపిన వారు చూస్తుండగానే కేవలం సెకండ్ల వ్యవధిలో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు అందరినీ నివ్వెరపోయేలా చేస్తూ ఉన్నాయి.ఇలాంటి తరహా ఘటనలు చూసిన తర్వాత మనిషి జీవితం ఇంతేనా అని ప్రతి ఒక్కరు కూడా ఆందోళనలో మునిగిపోతున్నారు.

ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన జరిగింది.హనుమంత రెడ్డి, పుష్పలత దంపతులకు ఒక్కగానొక్క కుమార్తె నిఖితా రెడ్డి(15). ప్ర‌స్తుతం తొమ్మిదో తరగతి చదువుతోంది. ఉదయం స్నానం చేసేందుకు బాత్రూములోకి వెళ్లింది. కుళాయిని తిప్పుతుండగా.. కరెంట్ షాక్ కొట్టి అక్కడిక్కడే మృతి చెందింది. ఆమె అరుపులకు విన్న తల్లిదండ్రులు ఆమెను బాత్రూమ్ నుండి బయటకు తీసుకు వచ్చే సరికి విగతజీవిగా కనిపించింది.

ఆసుపత్రికి తీసుకెళ్లగా చనిపోయినట్లు నిర్ధారించారు. షార్ట్ సర్య్కూట్ కారణంగా కుళాయికి విద్యుత్ సరఫరా జరిగి.. షాక్ తగిలి చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులకు సమాచారం అందించగా.. సీఐ అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నారు. ఒక్కాగానొక్క కుమార్తె చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు బాధ వర్ణనాతీతం.

Leave a Reply