Pawan Kalyan | నీ బ్రతుకేంటో అందరికీ తెలుసు రోజా..!

పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల మల్టీస్టారర్ బ్రో బాక్సాఫీస్ వద్ద స్ట్రగుల్ అవుతుంది. రెండు రోజులుగా ఈ చిత్ర వసూళ్లు భారీగా పడిపోయాయి. దర్శకుడు సముద్రఖని తెరకెక్కించిన ఈ ఎమోషనల్ ఫాంటసీ డ్రామా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఓపెనింగ్స్ పరంగా సత్తా చాటింది. వీకెండ్ వరకు బ్రో మూవీ జోరు కొనసాగింది. వర్కింగ్ డేస్ నుండి నెమ్మదించింది. సోమవారం బ్రో చిత్ర వసూళ్లు డెభై శాతానికి పైగా పడిపోయాయి.

తెలుగు రాష్ట్రాల్లో 4వ రోజు బ్రో కేవలం రూ. 2 కోట్ల షేర్ మాత్రమే సాధించింది.5వ రోజు బ్రో వసూళ్లు మరింతగా తగ్గాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రో రూ. 1.60 నుండి 1.70 కోట్లు మాత్రమే రాబట్టినట్లు సమాచారం. ఇక వరల్డ్ వైడ్ చూసుకుంటే బ్రో రూ. 2 కోట్ల షేర్ వసూలు చేసింది. ఐదు రోజులకు గానూ బ్రో మూవీ రూ. 61 కోట్ల షేర్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

బ్రో మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే.. నైజాం రూ. 30 కోట్లకు అమ్మారు. ఆంధ్రా రూ. 37.30 కోట్లకు వరకు రైట్స్ అమ్ముడుపోయాయి. సీడెడ్ రూ. 13.3 కోట్లకు అమ్మారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో బ్రో రూ. 80 నుండి 81 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలుపుకుంటే… రూ. 97 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ బిజినెస్ జరిగింది. కాబట్టి బ్రో వంద కోట్ల టార్గెట్ తో బరిలో దిగింది.

అది పక్కాన పెడితే బ్రో సినిమా థియేట‌ర్‌లో కొంద‌రు చిన్న పిల్ల‌లు రోజాతో పాటు ప‌లువురు వైసీపీ నాయ‌కుల‌ని ప‌చ్చి బూతుల‌తో తిట్టిపోసారు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండ‌గా, కొంద‌రు నెటిజ‌న్స్ పిల్ల‌ల‌కి సూచ‌న‌లు చేస్తున్నారు. చ‌దువుకునే పిల్ల‌ల నోటి నుండి ఇలాంటి మాట‌లా.. త‌ప్పు చిన్నా అంటూ కామెంట్ చేస్తున్నారు.మీకు ఎలా అనిపించిదో కామెంట్ లో తెలియచెయ్యండి,

Leave a Reply