ఈ మూడు రాశుల సుడి తిరుగుతోంది..? ఎందుకో తెలుసా..? అందులో మీరు ఉన్నారా..

జ్యోతిష్యశాస్త్రంలో రాహువును ఛాయా గ్రహం, దుష్ట గ్రహం, అంతుచిక్కని గ్రహంగా పిలుస్తారు. ఎవరి జాతకంలో రాహువు బలహీన స్థితిలో ఉంటాడో వారు అనేక కష్టాలను, నష్టాలను ఎదుర్కోవల్సి ఉంటుంది. ఏ వ్యక్తి కుండలిలో రాహువు బలంగా ఉంటాడో వారు కెరీర్ లో ఉన్నతస్థాయికి చేరుకుంటారు. పాలిటిక్స్ లో మంచి పేరు సంపాదిస్తారు. రాహు గ్రహం ఆగస్ట్ 11న మీనరాశిలోకి ప్రవేశించబోతుంది. ఇతడి సంచారం కారణంగా మూడు రాశులవారు మంచి లాభాలను పొందనున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.

తులారాశి
ఈరాశి యెుక్క ఆరో ఇంట్లో రాహు సంచారం జరగబోతుంది. దీంతో మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు కేసులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్‌తో పాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది.

కర్కాటకం
రాహు సంచారంతో కర్కాటక రాశి వారికి అదృష్టం పడుతుంది. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీరు ఏదైనా విలువైనది కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ ఆదాయ వనరులు పెరుగుతాయి. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది.

వృషభం
రాహు గ్రహ సంచారం వృషభరాశి వారికి ఊహించని ధనాన్ని ఇస్తుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. మీ కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. మీరు బెట్టింగ్, లాటరీ లేదా షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి లాభాలను గడిస్తారు.

Leave a Reply