Revanth Reddy | రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. సొంత నియోజకవర్గం కొడంగల్ పైనా ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇవాళ ఒక్కరోజే కొడంగల్ నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. రోడ్ షో ద్వారా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. దౌల్తాబాద్, మద్దూరు, కోస్గిలో కార్నర్ మీటింగ్స్ నిర్వహించారు. తను కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధిని ప్రస్తావిస్తూ.. ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రెండుసార్లు అధికారమిస్తే చేసిందేమీ లేదు గానీ.. మళ్లీ అధికారం కావాలని ఏం ముఖం పెట్టుకుని అడుగుతున్నారని ప్రశ్నించారు. ఓట్లు వేయించుకుని పనులు చేయకుండా కాలయాపన చేసిన ప్రభుత్వానికి బుద్ధిచెప్పాలన్నారు రేవంత్ రెడ్డి.అంతకుముందు దౌల్తాబాద్ రోడ్షోలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి తిట్టారంటూ మహిపాల్రెడ్డి వర్గీయులు రేవంత్ ముందే గొడవకు దిగారు.
రోడ్షో చేస్తున్న వాహనంపైనే వాగ్వాదానికి దిగారు. దీంతో గుర్నాథరెడ్డితో క్షమాపణ చెప్పించారు రేవంత్రెడ్డి.అయితే ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. టీవీ9పై ఫుల్ సీరియస్ అవుతున్న ఈ వీడియోలో తొక్కిపట్టి నారతీస్తానని అన్నాడు. అడ్డగోలు పనులు చేస్తే చూస్తూ ఊరుకుంటామని అనుకుంటున్నారో పండబెట్టి తొక్కి పేగులు తీస్తానని అన్నాడు. పేపర్, టీవీ9 నా కొడుకులు మైకులు తీసుకొచ్చి పెడితే వాటికి వివరించే ఓపిక తీరిక లేదంటూ రేవంత్ రెడ్డి ఒకింత ఘాటుగానే స్పందించారు.