Actor Mansoor | కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ తీవ్ర అనారోగ్యం పాలైనట్లు తెలుస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడటం వలన ఆయన చాలా రోజులుగా అవస్త పడుతున్నాడట.దాంతో అతన్ని హాస్పిటల్లో చేర్చినట్టు చెన్నై మీడియా వర్గాల సమాచారం. మన్సూర్ ను ప్రస్తుతం ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నారు వైద్య నిపుణులు.మరో 48 గంటలు గడిస్తే కానీ అతని పరిస్థితి చెప్పలేమని వైద్యులు తెలిపారు.
వేలూరు నియోజకవర్గం నుంచి ఆయన ఇండిపెండెంట్ గా లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచారు.‘డెమోక్రటిక్ టైగర్స్ ఆఫ్ ఇండియా’ పేరుతో పార్టీని ఆయన ప్రారంభించారు. అయితే తన పార్టీకి ఇంకా ఎన్నికల సంఘం గుర్తింపు రాకపోవడంతో.. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఉండగానే ఆయనకు ఛాతిలో స్వల్ప అసౌకర్యం కలిగింది. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మన్సూర్ అలీ ఖాన్.. వాటిన లెక్కచేయకుండా ప్రజల సమస్యలపై గళం విప్పుతున్నారు.
ప్రస్తుతం ఆయన సినిమాలకు విరామం ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆయన తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఇక ఇటీవల హీరోయిన్ త్రిషపై మన్సూర్ చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. లియో మూవీలో త్రిష, మన్సూర్ నటించారు. త్రిషతో రేప్ సీన్ ఉంటుందని, ఆమెను బెడ్ రూంలోకి తీసుకెళ్లే ఛాన్స్ వస్తుందని తాను ఆశపడ్డానని మన్సూర్ అన్నారు. ఈ వ్యాఖ్యలను కోలీవుడ్, టాలీవుడ్కి చెందిన పలువురు ప్రముఖులు తీవ్రంగా ఖండించారు.
Central Govt | కేంద్ర ప్రభుత్వం శుభవార్త మహిళలకు రూ.25 లక్షలు ఉచితం.. క్లారిటీ ఇదే ..!