Actor Raghu Babu | సినీనటుడు, సీనియర్ నటుడు గిరిబాబు కుమారుడు రఘుబాబు (Raghubabu) నడుపుతున్న కారు ఓ ద్విచక్రవాహనదారుడిని ఢీకొంది (Raghubabu Car Accident). ఈ ఘటనలో ఆ బైక్ మీదున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. నల్లగొండ జిల్లా కేంద్రం శివారు అద్దంకి-నార్కట్పల్లి రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది. మృతుడు బీఆర్ఎస్ నాయకుడు, నల్లగొండ శ్రీనగర్ కాలనీకి చెందిన సందినేని జనార్దన్ రావు (55).
నల్గొండ జిల్లా కేంద్రంలోని నార్కట్ పల్లి – అద్దంకి రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. నల్గొండ పట్టణానికి చెందిన 48 ఏళ్ల జనార్దన్ రావు.. తన ఫాంహౌస్ లో వాకింగ్ కోసం టూ వీలర్ మీద వెళుతున్నారు.అయితే.. ఫాం హౌస్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న క్రమంలో హైదరాబాద్ నుంచి గుంటూరుకు కారును సొంతంగా నడుపుతూ వెళుతున్న రఘుబాబు.. వెనుక నుంచి టూ వీలర్ ను బలంగా ఢీ కొన్నారు. అయితే.. జనార్దన్ రావు రాంగ్ రూట్ లో రావటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా చెబుతున్నారు.
ఈ ప్రమాదం అనంతరం తీవ్రమైన ఒత్తిడితో ఉన్న రఘుబాబును.. అక్కడి స్థానికులు పలువురు.. ‘‘మీ తప్పేం లేదు. బండిని ఆయన రాంగ్ రూట్ లో తీసుకొచ్చారు’’ అన్న వీడియోలు కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయ్యాయి.రఘుబాబు కారు.. జనార్థన్ రావు వాహనాన్ని బలంగా ఢీ కొనటంతో.. బ్యాలెన్సు తప్పిన ఆయన.. ఎగిరి డివైడర్ మీద పడ్డారు. తల.. ఛాతి భాగంలో బలమైన గాయాలు కావటంతో ఘటనాస్థలంలోనే మరణించారు. జనార్దన్ రావుకు కుమార్తె.. కుమారుడు ఉన్నారు. పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ తో రఘుబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.