Anasuya Bharadwaj | తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ నటి అనసూయ భరద్వాజ్( Anasuya Bharadwaj ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం అనసూయ వెండితెరపై వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.మొన్నటివరకు బుల్లితెరపై యాంకర్ గా తన సత్తాను చాటిన అనసూయ ప్రస్తుతం వెండితెరపై నటిగా వరుసగా అవకాశాలను అంటూ అందుకుంటూ బిజీ బిజీగా గడుపుతోంది.
కేవలం పాత్రకు అధిక ప్రాధాన్యం ఉన్న పాత్రలను మాత్రమే చేస్తూ మెప్పిస్తోంది.ఈ మధ్యకాలంలో అనసూయ ఎక్కువగా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను ఎంచుకుంటోంది.కాగా పుష్ప,దర్జా లాంటి సినిమాలో నెగిటివ్ రోల్స్ లో నటించిన విషయం తెలిసిందే.ఐటమ్ సాంగ్ లో కూడా చేసింది.ఇది ఇలా ఉంటే మరోసారి బో** ల్డ్ రోల్ లో నటించబోతోంది అనసూయ.
ఈ సినిమాలో సుమతి అనే పాత్రలో నటించబోతున్నట్లు తాజాగా చిత్ర బృందం వెల్లడించింది.నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మాస్టర్ ధ్రువన్, మీరా జాస్మిన్, రాహుల్ రామకృష్ణ, ధన్రాజ్, రాజేంద్రన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమాతో మీరా జాస్మిన్ మరోసారి తెలుగు ఆడియెన్స్ ని అలరించబోతోంది. ఈ వీడియో వైరల్ కావడంతో రకరకాల కామెంట్స్ ను అందుకుంటుంది..
ఇది చదవండి: దానికోసం మళ్ళీ తల్లి కాబోతున్న యాంకర్ అనసూయ..?
ఇలా చేస్తూ యువతను రెచ్చగొడుతుందని, డబ్బుల కోసం ఇంతలా దిగజారాల అంటూ కొందరు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి..దీనిపై అనసూయ అలానే స్పందించింది.. అన్నీ అలా అనుకోకూడదు సినిమా కోసం కొన్ని తప్పవు అంటూ పోస్ట్ చేసింది.. అది కాస్త ఇప్పుడు వైరల్ అవుతుంది,