Gold rate | దేశంలో బంగారం ధరలు శుక్రవారం పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 300 పెరిగి.. రూ. 55,450కి చేరింది. గురువారం ఈ ధర రూ. 55,150గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 3,000 పెరిగి, రూ. 5,54,500కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ. 5,545గా కొనసాగుతోంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం పెరిగాయి.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,600గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,640గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,450 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 60,640గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55,450గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,490గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి.
దేశంలో వెండి ధరలు శుక్రవారం భారీగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,840గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 1,000 పెరిగి 78,400కి చేరింది. గురువారం ఈ ధర రూ. 77,400గా ఉండేది.