YadammaRaju | టాలీవుడ్ కమెడియన్ యాదమ్మ రాజు.. ‘పటాస్’ కామెడీ షోతో మంచి ఫేమ్ ని సంపాదించుకున్నాడు. ఆ తరువాత కూడా పలు టీవీ షోల్లో నటిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపుని పొంది సినిమా అవకాశాలను సైతం అందుకున్నాడు.
ఇక గత ఏడాది తాను ప్రేమించిన అమ్మాయి ‘షార్లీ స్టెల్లా’నే పెళ్లి చేసుకోబోతున్నట్లు ఒక షో ద్వారా తెలియజేశాడు. 2022 నవంబర్ లో నిశ్చితార్ధం చేసుకున్న వీరిద్దరూ.. డిసెంబర్ లో ఏడడుగులు వేశారు.ఈ పెళ్ళికి నాగబాబు, అశ్విన్ బాబు, ఆకాష్ పూరీ, యాంకర్ ప్రదీప్ వంటి స్టార్స్ కూడా హాజరయ్యి శుభాకాంక్షలు తెలియజేశారు.ఇక ఈ పెళ్లి తరువాత వీరిద్దరూ కలిసి పలు టీవీ షోల్లో కూడా కనిపించారు.
అయితే కొన్ని రోజులు నుంచి వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లు నెట్టింట పుకార్లు వినిపిస్తున్నాయి.అదంతా పక్కన పెడితే తాజాగా YadammaRaju యాదమ్మ రాజు యాక్సిడెంట్ అయ్యింది, తాజాగా ఇంటర్వూలో పాల్గొన్నాడు రాజు. తనకు జరిగిన ప్రమాదం గురించి వివరించాడు. తన తప్పు లేకపోయినా యాక్సిడెంట్కి గురయ్యానని.. కాలికి ఒక వేలు తీసేసి సర్జరీ చేశారని చెప్పుకొచ్చాడు.
‘కాలు బాగోకపోయినా ప్రమోషన్స్కి వచ్చావ్. నీకు సినిమా అంటే ఎంతిష్టమో అర్థమవుతుంది. త్వరగా కోలుకుని, మంచి క్యారెక్టర్లతో మమ్మల్ని ఎంటర్టైన్ చెయ్యాలి. నువ్వు బాగుండాలి భయ్యా’ అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ‘స్లమ్డాగ్ హస్బండ్’ మూవీలో హీరో స్నేహితుడిగా యాదమ్మ రాజుకి మంచి క్యారెక్టర్ పడింది.