మళ్ళీ నోరు జారిన మంత్రి రోజా.. బైబై వైసీపీ.. ఆడేసుకుంటున్న నెటిజన్లు!

ysrcp

వైసీపీ మంత్రుల్లో మగవారికి ధీటుగా, రెబల్ లేడీగా ప్రతిపక్షాలు చేసే వ్యాఖ్యలను తిప్పి కొడుతూ ఉంటారు మంత్రి రోజా. తమ నాయకుడిని, అలాగే రాష్ట్రానికి సంబంధించి ఎవరు ఏమన్నా ఈమె మాత్రం అస్సలు ఏమాత్రం సైలెంట్ గా ఉండరు. అప్పటిదాకా కామ్ గా ఉండే మంత్రి రోజా, ఒక్కసారిగా మీడియా ముందుకు వచ్చి చాలా వైలెంట్ గా ఉగ్ర రూపంలో ఒక్కోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తుంటారు.

నోరు జారీ అనకూడని మాటలు అనేస్తారు.. చివరికి బుద్ధి వచ్చి క్షమాపణలు చెబుతారు.ఇక ఇదే రీతిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తల్లికి మంత్రి రోజా క్షమాపణలు చెప్పారు. అవును.. వాలంటీర్లపై ఉమెన్ ట్రాఫికింగ్ ఆరోపణలు చేసిన పవన్‌పై నిప్పులు చెరిగారు రోజా. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ… నోరు జరారు. నీ తల్లి నేర్పిన సంస్కారం ఇదేనా? అని పవన్ కళ్యాణ్ ని రోజా ప్రశ్నించారు. అంతలోనే మళ్ళీ తిరిగి… నీ తల్లి చాలా గొప్పది.. అలా అనవద్దు.

‘అమ్మా.. నన్ను క్షమించమ్మా’ అని రోజా పవన్ కళ్యాణ్ తల్లిని క్షమాపణ కోరారు.అయితే తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ హాయ్ ఏపీ అంటూ రోజా బైబై వైసీపీ అన్న‌ట్టు వీడియో క్రియేట్ చేశారు.ఇక అలానే అంబ‌టితో పాటు వైసీపీ మంత్రులు కూడా ఏదో సంద‌ర్భాల‌లో బైబై వైసీపీ అనగా, దానిని తీసుకొచ్చి ప‌వ‌న్ క‌ళ్యాణ్ వాయిస్‌కి జ‌త చేశారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింత తెగ వైర‌ల్గా మారింది.

Leave a Reply