Nithyananda: నిత్యానంద కైలాసానికి తన ప్రియురాలినే ప్రధానిని చేసిన స్వామీజీ..! ఎవరో తెలుసా

నిత్యానంద.. ఈ పేరు చెబితే చాలు.. భారత్‌ నుంచి చెక్కేసి ఎక్కడో దక్షిణ అమెరికా దీవుల్లో తిష్ఠ వేసిన స్వామీజీ మరోసారి వార్తల్లోకెక్కాడు. తన దేశానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే పనిలో ఉన్నాడు నిత్యానంద. నిత్య వివాదాల స్వామి నిత్యానంద కైలాస రాజ్యాన్ని ప్రకటించినప్పుడు ఎవరు నమ్మలేదు.

కాని అమెరికాలోని ఓ రాష్ట్రం ఆ దేశాన్ని గుర్తించింది. అంతేకాదు నిత్యానంద కైలాసంతో నెవార్క్‌ సిటీ ద్వైపాక్షిక ఒప్పందం కూడా కుదుర్చుకుంది.ఇక తన దేశానికి అమెరికానే గుర్తింపు ఇచ్చిందని ప్రచారం చేసుకుంటున్నారు నిత్యానంద. న్యూజెర్సీ రాష్ట్రంలోని నెవార్క్‌ సిటీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. న్యూజెర్సీ రాష్ట్రంలో ఎక్కువ జనాభా కలిగిన సిటీగా నెవార్కకు పేరుంది.

సిటీ కౌన్సిల్‌ నిత్యానంద కైలాసదేశంలో ఒప్పందం కుదుర్చుకోవడం సంచలనం రేపుతోంది.అమెరికాలో ప్రతి రాష్ట్రానికో చట్టం అమల్లో ఉంటుంది. ఎవరికి వాళ్లు సొంతంగా ఒప్పందాలు కుదుర్చుకునే వీలుంటుంది. లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద 50 సార్లు కోర్టుకు హాజరై, 2019 నవంబర్లో భారత్ వదిలి ప‌రార్ అయ్యారు.

ప్రియ శిష్యురాలైన నటి రంజిత

ప్రస్తుతం కైలాస అనేది నిత్యానంద ప్రపంచం. దానికి తనని తాను ప్రధానిగా ప్రకటించుకున్నారు. తాజాగా ఆయన ప్రియ శిష్యురాలైన మాజీ నటి రంజితను( actress Ranjitha ) ఆ దేశానికి ప్రధానిని చేశారు. దానికి సంబంధించిన ప్రకటన గురించి ఒక తమిళ పత్రిక కథనాన్ని విడుదల చేసింది. దీంతో మరోసారి నిత్యానంద స్వామి వార్తల్లో నిలిచాడు.

Leave a Reply