Roja | షర్మిల నా జగనన్న గురించి తప్పు మాట్లాడవు అంటే చచ్చిపోతావు..

allroudadda

Roja | మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల రాజకీయ పోకడ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పరిచయమే. ముక్కుసూటిగా, కుండబద్ధలు కొట్టినట్టుగా అభిప్రాయాన్ని వెలిబుచ్చడంలో ఆమెకు ఆమే సాటి. పార్టీ సిద్ధాంతాన్ని, వైఖరిని ధైర్యంగా జనాల్లోకి తీసుకెళ్లడంలో ఆమె స్టైలే ప్రత్యేకం. తెలంగాణలో కేసీఆర్‌ వంటి రాజకీయ దిగ్గజాన్ని ఆమె సవాలు చేశారు. సై అంటే సై అంటూ సవాళ్లు విసిరారు.

ఇక అన్న జగన్ అవినీతి కేసులో జైళ్లో ఉన్నప్పుడు పార్టీని ఆమె ఏవిధంగా బతికించారో కూడా అందరికీ తెలుసు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గూటికి చేరాక కూడా ఆమె రాజకీయ శైలిలో ఎలాంటి అదురుబెదురు కనిపించడం లేదు. సుస్పష్టమైన రాజకీయ వైఖరిని ఆమె కనబర్చుతున్నారు. సీఎం సీటులో సొంత అన్న కూర్చున్నప్పటికీ ఆమె కచ్చితమైన రాజకీయ వైఖరిని ప్రదర్శిస్తున్నారు.అది పక్కన పెడితే తాజాగా షర్మిల పై రోజా ఫైర్ అయ్యారు..

allroudadda
allroudadda

షర్మిల రాకతో ఆంద్రప్రదేశ్ కు మరొక నాన్ లోకల్ పొలిటీషియన్ వచ్చినట్లయిందని మంత్రి రోజా అన్నారు. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ కు ఓటు అడిగే హక్కు లేదన్నారు. తిరుపతిలోని వడమాలపేటలో కాన్సర్ స్క్రీనింగ్ పింక్ బస్సు క్యాంపును ఆమె మంగళవారం ప్రారంభించారు.

షాక్ జనసేనలోకి చేరిన జానీ మాస్టర్! నెల్లూరు నుంచి పోటీ

ఈ సందర్భంగా మాట్లాడుతూ వెఎస్సార్ మరణించాక ఆయన పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చిన ఘనత కాంగ్రెస్ దని, జగన్ ను జైల్లో పెట్టించింది కూడా కాంగ్రెస్ పార్టీయేననీ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పాలనలో విద్య, వైద్యం, మహిళాభివృద్ధికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.

Leave a Reply