Roja | వాల్తేరు వీరయ్య ఈవెంట్లో చిరంజీవి.. ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ కి ఇప్పుడు వైసీపీ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి కామెంట్స్ పై కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, అమర్నాథ్ వంటి వారు దారుణంగా స్పందించారు. ఇక తాజాగాబుధవారం తిరుపతి జిల్లా, వడమాలపేటలోని “నా మట్టి నా దేశం” కార్యక్రమంలో ఏపి పర్యాటక శాఖా మంత్రి ఆర్.కే.రోజా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. చిరంజీవి ఏ సందర్భంలో ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో తనకు తెలియదు కానీ, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గానీ, మంత్రులు గానీ, ఎవరైనా ఇప్పటి వరకు సినిమా వాళ్ళ రెమ్యూనివేషన్ గురించి మాట్లాడలేదన్నారు.
ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ తను సినిమా చేస్తే రెండు కోట్లు ఇస్తారు, ఐదు కోట్లు ఇస్తారు, 30 కోట్లు ఇస్తారని తానే చెప్పుకుంటారని, ఎవరూ ఇంత వరకూ అలా చెప్పుకోలేదన్నారు.. సినిమాలు చేసే సమయంలో సినిమాలకు పరిమితం కావాలని, రాజకీయం చేసే సమయంలో కేవలం రాజకీయాలు మాత్రమే మాట్లాడాలని ఆమె సూచించారు