Soundarya: కన్నీళ్లు తెప్పిస్తున్న సౌందర్య చివరి మాటలు… చనిపోయే ముందు తన మేడకోడలితో ఏమన్నారంటే..!

Soundarya: సౌందర్య ఎలాంటి పాత్ర పోషించినా ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసి అందరి దగ్గరి నుండి ప్రశంసలను అందుకున్నారు. అంతేకాదు.. ఆమె ఎన్నో సినిమాల్లో చీరకట్టులోనే కనిపించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న సౌందర్య ఛాన్స్ వస్తే దర్శకత్వం కూడా వహించాలని అనుకున్నారు.

కానీ.. దర్శకత్వం చేయాలనే కోరిక తీరకుండానే సౌందర్య మృతి చెందారు.శివశంకర్ షూటింగ్ సినిమా సమయంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వెళ్తోన్న సమయంలో విమాన ప్రమాదంలో సౌందర్య కన్నుమూశారు. 2004 ఏప్రిల్ 17న ఆమె తుదిశ్వాస విడిచారు. అయితే సౌందర్య చనిపోయే ముందు చివరిసారిగా తన మేనకోడలితో మాట్లాడరట.

ఆమె తన మేనకోడలితో కాటన్ చీరలు.. కుంకుమ కావాలని చెప్పారట. ఎన్నికల ప్రచారం కోసం తన వద్ద కాటన్ చీరలు లేవని.. అవి కొనాలని.. అలాగే కుంకుమ సైతం తీసుకురావాలని చెప్పారట.

ఆ విషయం తన మేనకోడలితో మాట్లాడి ఎన్నికల ప్రచారం కోసం విమానంలో బయలుదేరిన ఆమె ప్రమాదానికి గురయ్యారు. తెలుగుతోపాటు.. హిందీలోనూ అగ్ర కథానాయికగా కొనసాగింది. అమితాబ్ బచ్చన్ సరనస కూడా నటించింది.

Leave a Reply